సుశాంత్ సింగ్ ఆత్మహత్య తర్వాత బాలీవుడ్ లో చీకటి కోణాలు ఒక్కొక్కటి బయటపడుతున్నాయి. కంగన.. శేఖర్ కపూర్.. ప్రకాష్ రాజ్ తో పాటు.. రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పాయల్ రాజ్ పుత్ కూడా ఘాటుగా విమర్శలు గుప్పించింది. బాలీవుడ్ లో బంధుప్రీతి నరనరాల్లో ఉందని...ఈ క్రమంలో తనను కూడా దూరంగా పెట్టారని పేర్కొంది పాయల్. సమస్యలకు ఆత్మహత్య పరిష్కారం కాదంటూ.. ఇన్ స్టా స్టోరీస్ లో సుశాంత్ ఆత్మహత్య పట్ల దిగ్బ్రాంతి వ్యక్తం చేసింది పాయల్. 

 

బాలీవుడ్ ప్రముఖులు తనతో స్నేహంగా ఉండరంటూ.. సుశాంత్ పాత ఇంటర్వ్యూను చూసిన పాయల్.. ఇన్ స్టాగ్రామ్ స్టోరీస్ లో స్పందించింది. బాలీవుడ్ లో నెపోటిజం ఉందనీ.. దీనికి అదృష్టం పేరు పెట్టి.. అందరిలో అభద్రతాభావం కల్పిస్తారని ఘాటుగా స్పందించింది పాయల్. ఇన్ స్టా ప్రొఫైల్ పిక్ గా..సుశాంత్ ఫోటో పెట్టింది. 

 

పాయల్ 2017లో పంజాబీ మూవీతో వెండితెరకు పరిచయమైంది. రెండో సినిమాకే హిందీలో అడుగుపెట్టి.. వీర్ కె వెడ్డింగ్ మూవీ చేసింది. ఈ సినిమా తర్వాత హిందీలో మరో సినిమాలో నటించలేదు. ఒక్క సినిమాకే బాలీవుడ్ తనను దూరం పెట్టేసిందని... పాయల్ నువ్వు దీనికి సరిపోవు అంటూ చిన్నచూపు చూసిందని వాపోయింది పాయల్. తన స్థానంలో మరొకర్ని తీసుకున్నప్పుడు.... ఆత్మహత్య చేసుకోవాలి అనుకోలేదనీ పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకుంది పాయల్. అయతే ఆ చేదు అనుభవం ఎవరి నుంచి ఎదురైందో చెప్పలేదు. 

 

పాయల్ కెరీర్ స్టార్ట్ చేసి మూడేళ్లు అయినా.. ఆమె మాటలు వింటుంటే.. 30ఇయర్స్ ఇండస్ట్రీ అనేలా స్పందించింది. ప్రతీ వ్యక్తికి మానసిక ఆరోగ్యం ఎంతో ముఖ్యమంటోంది. జీవితం ఎంతో అమూల్యమైందనీ.. దాన్ని మధ్యలోనే సులభంగా వదిలేయద్దంటోంది పాయల్. ప్రపంచంలోని ఏ వ్యక్తి ప్రతీరోజు సంతోషంతో ఉండలేడు. ఒక వేళ ఉంటే అతడు మనిషి కాదనిపాయల్ పేర్కొన్నారు. బంధుప్రీతిపై ఆగ్రహం వ్యక్తం చేసిన కంగనాకు థ్యాంక్స్ చెప్పింది పాయల్. 

మరింత సమాచారం తెలుసుకోండి: