ఈ సినిమాలో బాలకృష్ణను డిఫరెంట్ గా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమా తర్వాత బోయపాటి దిల్ రాజు నిర్మాణంలో ఓ సినిమా చేస్తాడని టాక్. బోయపాటి శ్రీనుని డైరక్టర్ గా ఇంట్రడ్యూస్ చేసింది దిల్ రాజే. భద్ర సినిమా ఆయన డైరక్షన్ లోనే వచ్చింది. అల్లు అర్జున్ కోసం అనుకున్న ఆ కథ బన్నీ ఎందుకో చేయనని చెప్పడంతో రవితేజకు వచ్చింది. మాస్ మహరాజ్ రవితేజ కెరియర్ లో భద్ర మంచి హిట్ సినిమాగా నిలిచింది.
ఇక భద్ర తర్వాత ఇన్నేళ్లకు మళ్ళీ బోయపాటి శ్రీను, దిల్ రాజు కలిసి పనిచేస్తున్నారు. ఈ సినిమాలో స్టార్ హీరో నటిస్తాడని తెలుస్తుంది. అసలైతే మహేష్, వంశీ పైడిపల్లి మూవీని ప్లాన్ చేశాడు దిల్ రాజు. అయితే మహేష్ మాత్రం ఎందుకో ఆ కాంబో రిజెక్ట్ చేశాడు. దిల్ రాజు బ్యానర్ లో బోయపాటి శ్రీను చేస్తున్న నెక్స్ట్ సినిమాలో హీరోగా ఎవరు నటిస్తారో తెలియాల్సి ఉంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి