మాస్ మహరాజ్ రవితేజ, అందాల నటి శ్రుతి హాసన్ జంటగా నటించిన క్రాక్ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదలైన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ చిత్రానికి హిట్ టాక్ రావడంతో విజయవంతంగా దూసుకెళ్తోంది. 50 శాతం ఆక్యుపెన్సీనే ఉన్నప్పటికి రవితేజ క్రాక్ చిత్రం బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లను సాధిస్తోంది. గత కొంతకాలంగా రవితేజకు ఒక్క హిట్ కూడా పడటం లేదు. దీంతో క్రాక్ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలని రవితేజ కసితో ఈ చిత్రంలో నటించారు. ఇక `క్రాక్` సినిమా హిట్ కావడంతో మాస్ మహారాజ్ రవితేజలో ఫుల్ జోష్ నింపింది.

వరుస పరాజయాలకు చెక్ పెట్టి రవితేజను క్రాక్ మూవీ మళ్లీ ఫామ్‌లోకి తీసుకొచ్చేసింది. క్రాక్ ఇచ్చిన విజయంతో ఆయన వరుస సినిమాలను లైన్‌లో పెట్టేశారు. మంచి కథ ఉన్న చిత్రాలను ఎంచుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఇక `క్రాక్` సినిమా సూపర్ హిట్ అయిన నేపథ్యంలో రవితేజ వరుస ఇంటర్వ్యులు ఇస్తూ వస్తున్నారు. ఇలా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆయన ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. అదేంటంటే.. రవితేజ సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన విషయం తెలిసిందే. అయితే ఈ సందర్భంగా రవితేజ తాను తీసుకున్న మొదటి పారితోషికం గురించి వెల్లడించాడు. తాను అక్కినేని నాగార్జున నటించిన నిన్నే పెళ్లాడతా సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశానని రవితేజ చెప్పాడు.
సినిమా పూర్తయ్యాక అక్కినేని నాగార్జున తనకు ఓ చెక్‌ను సంతకం చేసి ఇచ్చారని అన్నాడు. ఆ చెక్ అమౌంట్ మూడు వేల ఐదు వందల రూపాయలు అని, దాన్ని ఎన్నో రోజులు భద్రంగా దాచుకున్నానని రవితేజ చెప్పుకొచ్చాడు. కొద్ది రోజుల తర్వాత తనకు డబ్బులు అత్యవసరం కావడంతో ఆ చెక్‌ను బ్యాంకులో వేసేశానని అన్నాడు. ఎంతో మందికి తెలియని విషయం రవితేజ చెప్పడం విశేషం. తినడానికి తిండి కూడా లేని రోజుల నుంచి టాలీవుడ్‌లో స్టార్ హీరోల సరసన చేరిన నటుల్లో రవితేజ కూడా ఒకరు. 

మరింత సమాచారం తెలుసుకోండి: