రెబల్ స్టార్ ప్రభాస్ "బాహుబలి" సినిమాతో పెద్ద పాన్ ఇండియా స్టార్ అయిన సంగతి తెలిసిందే. తరువాత "సాహో" సినిమాతో కూడా బాలీవుడ్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు.కాని తెలుగులో సాహో భారీ డిజాస్టర్ అయ్యింది.సినిమా ఫెయిల్యూర్ కి మ్యూజిక్ కూడా కారణమే. మొదట శంకర్-ఎహ్‌సాన్-లాయ్‌లను సంగీత దర్శకులుగా ఎంపిక చేసుకున్న నిర్మాతలు ఆ తరువాత వాళ్లని కాదని.. ఒక్కో పాటను ఒక్కో మ్యూజిక్ డైరెక్టర్ తో చేయించి, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాధ్యతలు జిబ్రాన్ కి అప్పగించారు. ఇది సినిమాకి పెద్ద మైనస్ అయింది. ఏది సింక్ లో లేక కంగాళీ అయింది. ఇప్పుడు ‘రాధేశ్యామ్’ సినిమా విషయంలో కూడా అదే రిపీట్ చేస్తున్నారని సమాచారం.ఈ సినిమాకి జస్టిన్ ప్రభాకరన్ ని మ్యూజిక్ డైరెక్టర్ గా తీసుకున్నారు. అతడే పాటలు, నేపథ్య సంగీతం అందిస్తాడని అంతా అనుకున్నారు.

కానీ ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో అన్ని పాటలకు సంబంధించిన వర్క్ జస్టిన్ చేయడం లేదట. నేపథ్య సంగీతం బాధ్యత కూడా అతడిది కాదని తెలుస్తోంది. బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ మిథున్ ని తీసుకోబోతున్నారట.జస్టిన్ మాత్రమే అయితే ఉత్తరాది ప్రేక్షకులను మెప్పించడం కష్టమవుతుందన్న ఉద్దేశంతో ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ తో పాటు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వర్క్ ను మిథూన్ కి అప్పగించినట్లు తెలుస్తోంది.

 ‘సాహో’ విషయంలో ఇలా చేసి దెబ్బ తిన్నప్పటికీ మళ్లీ అదే తప్పుని రిపీట్ చేస్తుండడంపై పలు విమర్శలు వినిపిస్తున్నాయి. ఇక పోతే  ఫిబ్రవరి 14న ఈ సినిమా టీజర్ ని విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. జూలై 30న సినిమాను విడుదల చెయ్యాలని చిత్ర బృందం వారు భావిస్తున్నారట. ఇక ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో ఆసక్తికరమైన విషయాలు గురించి తెలుసుకోండి..

మరింత సమాచారం తెలుసుకోండి: