పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వకీల్ సాబ్ సినిమా పూర్తి చేసి ఏకే రీమేక్ షూటింగ్ లో బిజీ గా ఉన్నాడు. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా కి త్రివిక్రమ్ రచన చేస్తుండగా వకీల్ సాబ్ తర్వాతే ఈ సినిమా రిలీజ్ అవుతుందని తెలుస్తుంది. ఇప్పటికే  ఎనభై శాతం పూర్తయ్యింది.. త్వరలోనే మిగితా పార్ట్ కూడా కంప్లీట్ చేసి నెక్స్ట్ సినిమాలకు వెళతాడట పవన్.. మరోవైపు క్రిష్ సినిమా విరూపాక్ష సినిమా షూటింగ్ లోనూ పవన్ పాల్గొని ఒకప్పటి పవన్ కళ్యాణ్ ని గుర్తు చేస్తున్నాడు.. హరీష్ శంకర్ సినిమా ఇంకా లైన్లో నే ఉంది..

ఎలక్షన్స్ వచ్చే వరకు ఎన్ని సినిమాలు వీలుకైతే అన్ని సినిమాలు చేయాలనీ పవన్ కళ్యాణ్ డిసైడ్ అయిన విషయం తెలిసిందే.. ఈ నాలుగు సినిమాలే కాకుండా పవన్ కళ్యాణ్ పూరి దర్శకత్వంలో ఓ సినిమా, సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా చేయాలనీ డిసైడ్ అయినట్లు వార్తలు వస్తున్నాయి.  ఇదిలా ఉంటే వకీల్ సాబ్ అవ్వడానికి రీమేక్ అయినా సరే పవన్ మార్క్ లో కావాల్సినన్ని మార్పులను దర్శకుడు చేసేసాడు. అయితే ఇది ఎంత పవన్ కం బ్యాక్ సినిమా అయినా టైం అవుతున్న కొద్దీ ఎక్కడో చిన్న అనుమానం ప్రతీ ఒక్కరికీ ఉంది. అంచనాలను రీచ్ అవుతుందా? మేకర్స్ కరెక్ట్ గా ప్లాన్ చేసారా అన్నది.

మరి దీనికి సమాధానం గట్టిగానే ఇచ్చారని చెప్పాలి. ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఖచ్చితంగా మరో లెవెల్ కు ఈ సినిమాను తన ఆడియోతో తీసుకెళ్లడం ఖాయం అని చెప్పాలి. అప్పుడు వచ్చిన మగువా మగువా నుంచి ఇప్పుడు సత్యమేవ జయతే కు గట్టి గ్యాప్ ఉన్నా ఈ సాంగ్ తో సునాయాసంగా హైప్ ఒక్కసారిగా పెంచాడు. ఇప్పుడైతే ప్రతీ ఒక్కరి నుంచి కూడా మంచి రెస్పాన్స్ ను అందుకుంది. అలా మిగతా మ్యూజిక్ పార్ట్ అంతా కూడా కరెక్ట్ గా కుదిరితే సినిమా రిలీజ్ టైం కు అన్ని వర్గాలు నుంచి మంచి అటెన్షన్ గ్రాబ్ అవుతుందని చెప్పాలి.. మరి ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా వచ్చే ఏప్రిల్ 9న విడుదల అవుతున్న సంగతి తెలిసిందే..

మరింత సమాచారం తెలుసుకోండి: