యువ దర్శకుడు సుజీత్ రన్ రాజా రన్ అంటూ క్రైమ్ థ్రిల్లర్‌ను తన స్టైల్లో తెరకెక్కించి ఒక్కసారిగా అందరి దృష్టిని తనవైపుకు తిప్పుకున్నాడు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా బారీ బడ్జెట్ సినిమా సాహో నిర్మించి ఒక్కరాత్రిలో టాప్ డైరెక్టర్‏గా మారిపోయాడు సుజీత్. ఆ సినిమా తర్వాత సుజీత్ నుంచి ఎలాంటి అప్ డేట్ రాలేదు. ఇటీవలే ఈ డైరెక్టర్ బాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ సినిమా రూపొందించబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి. కానీ వాటిపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. తాజాగా మరోసారి సుజీత్ తర్వాతి సినిమా గురించి మరో వార్త ఫిల్మ్ నగర్లో చక్కర్లు కోడుతుంది.

తాజా సమాచారం ప్రకారం ఈ స్టార్ డైరెక్టర్ సుజీత్ కన్నడ్ స్టార్ హీరో కిచ్చా సుదీప్‏తో ఓ సినిమా తెరెకెక్కించబోతున్నాడట. ఆ స్టోరీ లైన్‌ సుదీప్‌ని మెప్పించిందని కన్నడ మీడియాలో టాక్ వినిపిస్తోంది. పుల్ యాక్షన్ కథాంశంతో ఈ సినిమా రాబోతున్నట్లుగా తెలుస్తోంది. ఈ ఏడాది ద్వితీయార్ధంలో సెట్స్‌పైకి వెళ్లనుందట. అధిక భాగం బెంగళూరులో చిత్రీకరించేందుకు ప్రణాళికలు రచిస్తున్నారని సమాచారం. సాహో తరువాత.. పాన్ ఇండియా సినిమాలు తీసే సత్తా ఉన్న డైరెక్టర్‌గా…. గుర్తింపు తెచ్చుకున్న సుజిత్‌ను. మొదట్లో తెలుగు లూసిఫర్ కోసం డైరెక్టర్‌గా తీసుకున్నారు. కానీ ఆ తరువాత ఈ యంగ్‌ డైరెక్టర్‌ కు పెళ్లి ఫిక్స్‌ కావడంతో సినిమా నుంచి తప్పుకున్నడని టాక్ వచ్చింది.

ఇక సుజీత్ తన తదుపరి సినిమా కోసం కొందరు స్టార్లతో సంప్రదింపులు చేశారంట. మరి సుజీత్ తన బాలీవుడ్ సినిమాకి సుదీప్‌ను ఓకే చేసుకుంటారా లేదా అనేది హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటి వరకు ఈ విషయంపై అధికారిక ప్రకటన రాలేదు. హీరో ఫిక్స్ అయితే సుజీత్ ప్రకటిస్తారని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ‘విక్రాంత్‌ రోనా’ చిత్రంలో కథానాయకుడిగా నటిస్తున్నారు సుదీప్‌. దీంతోపాటు ఉపేంద్ర హీరోగా తెరకెక్కుతోన్న ‘కబ్జా’లో కీలక పాత్ర పోషిస్తున్నారు.  ఇక సుజీత్ తన తదుపరి సినిమా కోసం బాలీవుడ్ నిర్మాణ సంస్థ జీ స్టూడియోస్‏తో ఒప్పందం కుదుర్చుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: