అయితే కాల్పులు జరిగిన సమయంలో డైరెక్టర్ రోహిత్ శెట్టి ఇంట్లో ఉన్నారా ?లేదా అనే విషయం పైన ఇంకా ఎలాంటి క్లారిటీ రాలేదు. ఈ ఘటన నేపథ్యంలో రోహిత్ శెట్టి ఇంటి పరిసరాలలో కూడా భారీగానే పోలీసులు మోహరించినట్లు సమాచారం. ఈ ఘటన పైన జూహు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ కాల్పులు జరగడానికి గల కారణాలు ఏంటి అనే విషయం మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. ఈ కాల్పులలోఎవరికి ఎలాంటి గాయాలు కాలేదని అధికారులు తెలియజేస్తున్నారు .
డైరెక్టర్ రోహిత్ శెట్టి ఇంటి పైన జరిగిన ఈ కాల్పులపై అన్ని కోణాలలో కూడా దర్యాప్తు చేస్తున్నామంటూ ముంబై పోలీసులు వెల్లడించారు. కాల్పులు జరిపిన నిందితులను గుర్తించడానికి ప్రత్యేక టీమ్ ను ఏర్పాటు చేశామని కూడా తెలిపారు. సీసీటీవీ కెమెరాల ద్వారా నిందితుల కదలికలను కూడా పసిగట్టే ప్రయత్నం చేస్తున్నామని అధికారులు చెబుతున్నారు. డైరెక్టర్ రోహిత్ శెట్టి హిందీ పరిశ్రమలో టాప్ డైరెక్టర్గా పేరు సంపాదించారు. గోల్ మాల్ కామెడీ సిరీస్ తో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈ డైరెక్టర్ చెన్నై ఎక్స్ప్రెస్, సూర్యవంశి, సింగమ్, దిల్ వాలే ఆంటీ బ్లాక్ బాస్టర్ యాక్షన్ చిత్రాలను తెరకెక్కించారు. ప్రస్తుతం గోల్ మాల్ 5 తలకి ఎక్కిస్తూ ఉండగా వచ్చేయేడాది విడుదల కాబోతోంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి