ఎందుకంటే ఒరేయ్ బుజ్జిగా సినిమా కు ముందు రాజ్ తరుణ్ తో సినిమా చేయాలనుకున్న నిర్మాతలు అందరు ఇప్పుడు ఆ సినిమా రిలీజ్ అయిన తరువాత డ్రాప్ అవుతున్నారు.. అందుకు కారణం రాజ్ తరుణ్ కి మార్కెట్ చాలా బాగా పడిపోవడమే.. టాలీవుడ్ లో వరుసగా మూడు బ్లాక్ బస్టర్ హిట్ లు అందుకున్న హీరో ఇక టాప్ రేంజ్ కి వెళ్లడం ఖాయం అనుకున్నారు కానీ రాజ్ తరుణ్ విషయంలో మాత్రం అందరి అంచనాలు తారుమారు అయ్యాయి.. ఇదిలా ఉంటే రాజ్ తరుణ్, కొండా విజయ్ కుమార్ల సక్సెస్ఫుల్ కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం ‘పవర్ ప్లే’.
శ్రీమతి పద్మ సమర్పణలో వనమాలి క్రియేషన్స్ ప్రై.లి పతాకంపై ఈ చిత్రాన్ని మహిదర్, దేవేష్ సంయుక్తంగా నిర్మించారు. మార్చి 5న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న ఈ సినిమా గురించి హీరో రాజ్ తరుణ్ మీడియాతో ముచ్చటించారు. ఈ సినిమాలో చాలా అమాయకుడైన యువకుడి పాత్రలో నటించినట్లుగా ఆయన తెలిపారు. ఎందుకంటే ప్రతి సినిమాను సక్సెస్ కావాలనే ఉద్దేశంతోనే చేస్తాం. ఆడియెన్స్కు కనెక్ట్ అవుతుంది, కాకపోవచ్చు. అయితే చేసిన తప్పులను మళ్లీ రిపీట్ చేయకుండా చూసుకోవాలంతే. ఒరేయ్ బుజ్జిగా రిలీజ్ అనుకున్నప్పుడు కోవిడ్ ప్రభావం స్టార్ట్ కావడంతో సినిమా విడుదల ఆగింది. లాక్డౌన్ వచ్చింది. లాక్డౌన్ తర్వాత అందరూ కలుసుకున్నప్పుడు అందరం కలిసి ఈ సినిమాను ప్లాన్ చేశాం. అన్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి