సినిమా హిట్ అవుతుందని దాని మీద నమ్మకంతో.. ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచేయాలనే ఉద్దేశంతో విడుదలకి ముందుగానే ఐదు నుండి పది నిమిషాల సినిమాను విడుదల చేస్తుంటారు. గతంలో కొందరు దర్శకనిర్మాతలు ఇలానే చేశారు. ముఖ్యంగా హాలీవుడ్ మేకర్స్ రెగ్యులర్ గా ఇలా చేసేవారు. ఇప్పుడు ఇదే మాస్టర్ ప్లాన్ ని తన సినిమా విషయంలో ఫాలో అవ్వాలనుకుంటున్నాడు హీరో మంచు విష్ణు. హాలీవుడ్ దర్శకుడు జెఫ్రీ జీ చిన్ రూపొందించిన 'మోసగాళ్ళు' సినిమాలో ప్రధాన పాత్ర పోషించాడు మంచు విష్ణు.ఈ సినిమా ని హాలీవుడ్ స్టాండర్డ్స్ కి ఏమాత్రం తగ్గకుండా తెరకెక్కిస్తున్నారట..


ఇక పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సునీల్ శెట్టి, కాజల్ లాంటి స్టార్లు కూడా నటించాడు. నవదీప్, నవీన్ చంద్ర లాంటి యంగ్ హీరోలు కూడా ఈ సినిమాలో కనిపిస్తారు. టెక్నాలజీని వాడుకుంటూ కోట్లలో మోసం చేసే మోసగాళ్ళ కథతో ఈ సినిమాను తెరకెక్కించారు.ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే విడుదలకు ముందే ఈ సినిమాలోని తొలి పది నిమిషాల ఎపిసోడ్ ని చూపించేస్తారట.


హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం లాంటి ప్రధాన నగరాలలో స్క్రీనింగ్ ఏర్పాట్లు చేసి.. తొలి పది నిమిషాల సినిమాను ప్రదర్శించే ఏర్పాట్లలో ఉన్నారట. ఈ విధంగా చేయడం వలన ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెరుగుతుందని మంచు విష్ణు భావిస్తున్నాడు. మరి విష్ణు ప్లాన్ ఎంతవరకు ఫలిస్తుందో లేదో చూడాలి! ఇక ఈ సినిమాని పాన్ ఇండియా లెవెల్ లో విష్ణు విడుదల చెయ్యబోతున్నాడట...ఇక ఖచ్చితంగా ఈ సినిమా అందరిని ఆకట్టుకొని పెద్ద హిట్ అవ్వడం ఖాయమని మంచు విష్ణు చాలా నమ్మకంగా వున్నాడట.. ఇక చూడాలి హాలీవుడ్ రేంజిలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అవుతుందో...

మరింత సమాచారం తెలుసుకోండి: