కరోనా సెకండ్ వేవ్ నేపధ్యంలో సినిమాలు అన్నీ వరసపెట్టి వాయిదా పడుతుంటే ఈ విషయాలను లెక్క చేయకుండా ‘ఇష్క్’ విడుదల అవుతూ ఉండటం ఆశ్చర్యకరం. ప్రముఖ నిర్మాణ సంస్థ సూపర్ గుడ్ ఫిలిమ్స్ నిర్మించిన ఈమూవీకి చాల మంచి పబ్లిసిటీ చేస్తున్నారు. మళయాళం విదుదలైన ఒక మూవీకి రీమేక్ గా ఈమూవీని తీసారు.  


‘ఓ బేబి’ మూవీ ద్వారా పరిచయం అయిన తేజా సజ్జ హీరోగా నటిస్తున్న ఈ మూవీకి దిల్ రాజ్ ప్రొడక్షన్ హౌస్ లో దర్శకత్వ విభాగంలో అనేక సంవత్సరాలు పనిచేసిన ఎస్ఎస్ రాజ్ ఈమూవీకి దర్శకత్వం వహిస్తున్నాడు. ఒక చిన్న ప్రేమకథకు ఒక క్రైం స్టోరీ మిక్స్ చేసి డిఫరెంట్ స్క్రీన్ ప్లే తో వస్తున్న ఈమూవీ కరోనా సెకండ్ వేవ్ పరిస్థితులలో కూడ యూత్ కు బాగా కనెక్ట్ అవుతుందని ఆసిస్తునారు.


దర్శకుడు వేణు శ్రీరామ్ ముఖ్య అతిధిగా వచ్చిన ఈమూవీ ఫంక్షన్ లో హీరో తేజా ఒక షాకింగ్ కామెంట్ చేసాడు. ఈమూవీ విడుదల కాకుండానే 100 కోట్ల లాభం ఆర్జించింది అంటూ తెలియచేసి అందర్నీ ఆశ్చర్య పరిచాడు. ఇంతలోనే యూటర్న్ తీసుకుని తన మూవీ ప్రమోషన్ ఫంక్షన్ కు వేణు శ్రీరామ్ ముఖ్య అతిధిగా వచ్చాడు కాబట్టి వేణు దర్శకత్వం వహించిన ‘వకీల్ సాబ్’ కు 100 కోట్లు వచ్చినట్లుగా అదే సెంటిమెంట్ తో తన సినిమాకు కూడ అంత భారీ కలక్షన్స్ వస్తాయని ఆశాభావం వ్యక్తపరిచాడు.


యంగ్ హీరో తేజాకు 100 కోట్ల పై ఉన్న కోరిక మెచ్చుకోతగ్గది అయినప్పటికీ ఇంతకు వచ్చి అధికారికంగా ‘వకీల్ సాబ్’ కు 100 కోట్ల వచ్చింది అని చెప్పలేని పరిస్థితులలో తేజా కోరిక అత్యాస మాత్రమే అవుతుంది అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. సెకండ్ వేవ్ పరిస్థితులు తీవ్రంగా ఉన్నప్పకీ లాక్ డౌన్ లు కర్ఫ్యూలు ఇప్పటివరకు లేని పరిస్థితులలో ‘ఇష్క్’ ఏమాత్రం హీరో కోరికను తీరుస్తుందో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: