ప్రస్తుతం కొనసాగుతున్న కరోనా వైరస్ సెకండ్ వేవ్ పరిస్థితుల రీత్యా ప్రతి వ్యక్తిలోను స్వార్థం పెరిగిపోయి సామాజిక జీవితానికి మాత్రమే కాకుండా వ్యక్తిగత కుటుంబ అనుబంధాలకు కూడ దూరం అవుతున్నాడు. ఇలాంటి పరిస్థితులలో సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఒక వీడియో తమన్ ఆలోచనలను పూర్తిగా మార్చివేసింది.


ప్రస్తుతం చెన్నైలో కూడ కరోనా తీవ్ర స్థాయిలో ఉండటంతో అక్కడ అనేక వ్యాపార సంస్థలు మూత పడటంతో పాటు అక్కడ వీకెండ్ లాక్ డౌన్ తో పాటు రాత్రి పూట కర్ఫ్యూని కూడ కొనసాగిస్తున్నారు. ఇలాంటి పరిస్థితులు వల్ల అనేకమంది ఉపాది కోల్పోయి కనీసం ఆహారాన్ని కూడ పూర్తిగా తినలేని పరిస్థితులలో మనిషి ఉన్నాడు.


ముఖ్యంగా ఎటువంటి స్థిర నివాసం లేకుండా రోడ్డు పక్కన గుడారాలు వెసుకుని జీవించేవారి పరిస్థితి మరింత దయనీయంగా మారింది. ఇలాంటి పరిస్థితులలో ఒక వృద్ధురాలు కొన్ని రోజులుగా ఆహారానికి మంచినీరు కి దూరమై చెన్నై లోని ఒక ముఖ్య ప్రాంతంలో రోడ్డు పక్కన పడి ఉన్నా ఎవరు పట్టించుకోలేదు. అయితే మానవత్వం ఉన్న ఒక వ్యక్తి ఆ వృద్ధురాలు కి ఆహారాన్ని మంచినీరును అందించి ఆమెను బతికించడానికి తనవంతు ప్రయత్నం చేసాడు.


ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో పై అనేకమంది కామెంట్స్ కూడ చేస్తున్నారు. అయితే సంగీత దర్శకుడు తమన్ మాత్రం ఈ వీడియో పై స్పందిస్తూ ఆ వృద్దురాలుని ఆహారం ఇచ్చి నిలబెట్టడానికి ప్రయత్నించిన ఆ వ్యక్తి సంస్కారానికి తల వొంచి నమస్కారం పెట్టాలని ఉంది అని కామెంట్స్ చేస్తూ తాను ఇప్పటివరకు కనీసం ఒక్క సామాజిక కార్యక్రమం కూడ చేయనందుకు సిగ్గు పడుతున్నాను అంటూ బాధ పడ్డాడు. తాను త్వరలో ఇలాంటి అభాగ్యుల కోసం ఒక అనాధ ఆశ్రమాన్ని  పెడతాను అని తనకు ఆ వీడియో కనువిప్పు కలిగించింది అని అంటున్నాడు..



మరింత సమాచారం తెలుసుకోండి: