పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ని అభిమానించే ఫ్యాన్స్ చాలామంది ఉన్నారు. వాళ్లలో ప్రతి ఒక్కరూ
పవన్ ని ఒక్కసారైనా కలవాలని తపన పడుతుంటారు. నిజానికి సామాన్య ప్రజలే కాదు
టాలీవుడ్ ఇండస్ట్రీలో
నితిన్,
బండ్ల గణేష్,
సుడిగాలి సుధీర్ ఇలా చెప్పుకుంటూ పోతే ఎందరో సెలబ్రిటీలు కూడా
పవన్ ని బీభత్సంగా అభిమానిస్తుంటారు. అయితే వారి జాబితాలో "ఏక్ మిని కథ"
డైరెక్టర్ కార్తీక్ రాపోలు కూడా చేరిపోయారు. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన
పవన్ కల్యాణ్ పట్ల తనకున్న అభిమానాన్ని వ్యక్తపరిచారు.
పవన్ కళ్యాణ్ ని కలిస్తే చచ్చిపోతానేమో అని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. అదేంటి అని అడిగితే.. 'పవన్ కల్యాణ్ ని కలవగానే నా
గుండె అత్యంత వేగంగా కొట్టుకుని.. ఆగిపోయి.. ఆపై చచ్చిపోతానేమో' అని చెబుతూ ఆయన
పవన్ పట్ల తన విపరీతమైన ఇష్టాన్ని వ్యక్తపరిచారు. 'పవన్ ని కలిస్తే నా ఆనందానికి అవధులు ఉండవు.
పవన్ ని కలుసుకోవాలనేది నా చిరకాల కోరిక,' అని
కార్తీక్ రాపోలు చెప్పుకొచ్చారు.
ఇక తన
సినిమా గురించి మాట్లాడుతూ.. ఏక్ మిని కథ అవుట్ అండ్ అవుట్ ఫుల్ లెంగ్త్ ఎంటర్ టైనర్. ఈ
సినిమా చూస్తున్నంతసేపు ప్రేక్షకులు తెరకి అతుక్కుపోవడం ఖాయం. ఈ సినిమాని చాలా ఎంగేజింగ్ గా రూపొందించాము. అందువల్ల ఫ్యాన్స్ తమ చుట్టూ ఏం జరుగుతుందో అనే విషయాన్ని కూడా పట్టించుకోకుండా
సినిమా చూస్తారు అని ఆయన చెప్పుకొచ్చారు.
వకీల్ సాబ్
సినిమా థియేటర్ లో చూసినప్పుడు నాకు చాలా సంతోషం కలిగింది. నా
సినిమా చూస్తున్నపుడు ఫ్యాన్స్ కూడా అదే స్థాయిలో ఫీల్ అవ్వాలని నేను ఆశిస్తున్నాను అని ఆయన అన్నారు. ఏక్ మిని కథ సినిమాని ఏప్రిల్ 30 న రిలీజ్ చేయాలని ముందుగా అనుకున్నారు కానీ కరోనా నేపథ్యంలో
మూవీ యూనిట్ రిలీజ్ డేట్ ని వాయిదా వేసింది.