ఏక్ మినీ కథ.. యు.వి.క్రియేషన్స్ సంస్థ యొక్క అనుబంధ సంస్థ అయిన యూవీ కాన్సెప్ట్ బ్యానర్ లో  మ్యాంగో మూవీస్ మీడియా తో కలిసి నిర్మిస్తున్న చిత్రం ఇది. ఇందులో హీరోగా సంతోష్ శోభన్  నటిస్తుండగా, హీరోయిన్లుగా కావ్య థాపర్ , శ్రద్ధాదాస్ లు నటిస్తున్నారు. ఇక అంతే కాకుండా బ్రహ్మాజీ, సుదర్శన్, హర్షవర్ధన్, సప్తగిరి లు ప్రధాన పాత్రల్లో నటించడం మరో విశేషం. ఈ చిత్రానికి కార్తీక్ రాపోలు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ప్రవీణ్ లక్కరాజు సంగీతం అందిస్తున్నాడు..


సినిమా టీజర్ ను 2021 మార్చి 11న మహాశివరాత్రి సందర్భంగా విడుదల చేశారు. ఇక 2021 ఏప్రిల్ 30వ తేదీన థియేటర్లలో విడుదల చేయాలనుకున్నారు. కానీ కరోనా సెకండ్ వేవ్ కారణంగా వాయిదా పడింది. అయితే ఇప్పట్లో కరోనా తగ్గే ఛాన్స్ లేదని కొంతమంది నిర్మాతలకు ఇప్పటికే ఒక క్లారిటీ కూడా వచ్చేసింది. దీంతో ఓ టీ టీ డీల్స్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తున్నారు. ఇక ఇదే బాటలోనే ఏక్ మినీ కథ సినిమా కూడా నడవబోతోంది. యూవీ క్రియేషన్స్ లో తెరకెక్కిన బోల్డ్ మూవీ ఏక్ మినీ కథ సినిమా కూడా ఫైనల్ గా ఓ టి టి ఆఫర్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది..

రూ.9 కోట్లకు దీన్ని అమెజాన్ ఒరిజినల్ కింద ఇచ్చినట్లు తెలుస్తోంది. అంటే ఇకపై థియేటర్లలో ఈ సినిమా రాకపోవచ్చు. ఇక ఎంత లేదన్నా 5 కోట్లకు పైగా యూవీ క్రియేషన్స్ వారికి లాభం ఉంటుందని టాలీవుడ్ ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ మే నెల చివరిలో ఈ సినిమా ఓటీటీ లో విడుదల కావడానికి సిద్దమవుతోంది.. ఇక ఈ సినిమా లో వర్షం సినిమా దర్శకుడు శోభన్ కుమారుడు సంతోష్ శోభన్ నటిస్తున్న విషయం తెలిసిందే..


అయితే ఈ సినిమాలో హీరో పురుషాంగం చిన్నగా ఉందనే సమస్యతో బాధపడుతూ ఉంటాడు. ఏది ఏమైనా ఇక ఎట్టకేలకు ఈ సినిమా ఓటీటీ లో స్థానం సంపాదించుకుంది..


మరింత సమాచారం తెలుసుకోండి: