టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అగ్ర నిర్మాతగా కొనసాగుతున్నాడు దిల్ రాజు.ఏ దర్శకుడైనా దిల్ రాజు బ్యానర్ లో సినిమా చేయాలని అనుకుంటాడు.కానీ ఇప్పుడు ఓ దర్శకుడు మాత్రం దిల్ రాజు క్యాంపు కి గుడ్ చెప్పే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే..  సాధారణంగా దిల్ రాజు వంటి స్టార్ ప్రొడ్యూసర్ క్యాంప్ నుంచి బయిటకు రావటానికి ఏ దర్శకుడు ఇంట్రస్ట్ చూపించడు. కానీ ఎంతకాలం ఒకే బ్యానర్ ని పట్టుకుని ఏం వేళ్లాడతాము. ఇలా అయితే మనకు బయిట ఎవరూ ఆఫర్స్ ఇవ్వటం లేదని జనాలు అనుకునే ప్రమాదం ఉంది. రెమ్యునేషన్ డిమాండ్ చేయలేము. పరిధులు దాటాలి, కంపర్ట్ జోన్ ని వదేలియాలి అనుకున్నప్పుడే బ్యానర్ ని ప్రక్కన పెట్టడం జరుగుతుంది. ఇప్పుడు వేణు శ్రీరామ్ అదే చేయబోతున్నట్లు తెలుస్తోంది.

ఓ మై ప్రెండ్, ఎమ్ సి ఎ, వకీల్ సాబ్ అంటూ తన కెరీర్ లో చేసిన మూడు సినిమాలు దిల్ రాజు బ్యానర్ అయిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్ లోనే చేసారు.అందులో మొదటది తేడా కొట్టినా మిగతా రెండు సూపర్ హిట్ అయ్యాయి.వకీల్ సాబ్ సూపర్ హిట్టయ్యాక...ఇండస్ట్రీ దృష్టి ఈ డైరక్టర్ పై పడింది. పెద్ద బ్యానర్స్ నుంచి ఆఫర్స్ రావటం మొదలయ్యాయి. అయితే ఈ లోగా దిలా రాజు తన బ్యానర్ లోనే వేణు శ్రీరామ్ తదుపరి సినిమా చేస్తున్నాడని ప్రకటించారు. కానీ వేణు శ్రీరామ్ మాత్రం ఖరారు చేస్తూ ప్రకటన మాత్రం చేయలేదు.అయితే మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు...

వేణు శ్రీరామ్ ..ప్రస్తుతం దిల్ రాజు క్యాంప్ నుంచి బయిటకు వచ్చే వేరే పెద్ద బ్యానర్స్ ని ఎప్రోచ్ అవుతున్నారట. ఆయన ఈ మధ్యనే ఓ పెద్ద హీరోకు కథ వినిపించి ఓకే చేసుకున్నారని వినికిడి. పవన్ తో వెంటనే వేణు శ్రీరామ్ చేస్తాడని వార్తలు వచ్చాయి కానీ అవి ఇప్పట్లో జరిగేలా కనపడటం లేదు. ఎందుకంటే పవన్ వరస ప్రాజెక్టులతో బిజిగా ఉన్నారు.ఇక వేణు శ్రీరామ్ బయిటకు వెళ్లి సినిమా చెయ్యాల్సిన టైమ్ వచ్చింది. ఎందుకంటే హీరోలు ఎక్కడ ఏ బ్యానర్ లో లాక్ అయ్యి ఉంటే అక్కడికే డైరక్టర్స్ వెళ్లి సినిమా చెయ్యాలి. అల్లు అర్జున్ తో ఐకాన్ సినిమా వేణు శ్రీరామ్ తో అనుకున్నారు కానీ అది జరిగేటట్లు కనపడటం లేదు. అందుకే దిల్ రాజు కు ఆ విషయం చెప్పి బయట ప్రయత్నాలల్లో వేణు శ్రీరామ్ ఉన్నాడని ఫిల్మ్ సర్కిల్స్ లో వార్తలు వినిపిస్తున్నాయి...!!

మరింత సమాచారం తెలుసుకోండి: