ప్రస్తుతం టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన హీరోలందరూ తమ సినిమాల విషయంలో రోజు రోజుకు పరిణితి చెందుతున్నారు..క్యారెక్టర్ డిమాండ్ చేయాలే కానీ.. తమ వేష, భాషల్ని సైతం వెంటనే మార్చేసుకునేందుకు సిద్ధ పడుతున్నారు.ఇప్పటికే మన స్టార్ హీరోలు కొందరు ఈ విషయంలో కాస్త ముందున్నారనే చెప్పాలి. అలాంటి హీరోల్లో మన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ 'పుష్ప' సినిమా కోసం టోటల్ లుక్ తో పాటు చిత్తూరు యాసను ట్రై చేస్తున్నాడు.ఇప్పుడు మరో హీరో కూడా మన బన్నీ నే ఫాలో అవుతున్నాడు.ఇక వివరాల్లోకి వెళ్తే.. మాస్ మహారాజా రవితేజ ఇటీవల నటించిన క్రాక్ సినిమాలో ఒంగోలు స్లాంగ్ ని ట్రై చేసిన విషయం తెలిసిందే.

అయితే తన కొత్త సినిమా కోసం ఈ సారి చిత్తూరు స్లాంగ్ లో మాట్లాడబోతున్నాడట.రవితేజ హీరోగా శరత్ మండవ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనుంది. ఇప్పటికే ఇండ్రస్టీ లో రైటర్ గా తానేంటో ప్రూవ్ చేసుకున్న శరత్ మండవ.. రవితేజ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.ఇటీవల ఉగాది పండుగ రోజు ప్రారంభమైన ఈ సినిమాని సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు.1990 బ్యాక్ డ్రాప్ లో సాగే కథతో ఈ సినిమా తెరకెక్కనుందని.. అప్పట్లో జరిగిన ఓ వాస్తవ సంఘటన ఆధారంగా ఈ సినిమాను తీయనున్నాడట శరత్..దీనికి సంబంధించి ఇప్పటికే స్క్రిప్ట్ కూడా కంప్లీట్ అయ్యింది.

సినిమా చిత్తూరు ప్రాంతంలో జరగనుంది. అందుకే రవితేజ ఇందులో చిత్తూరు యాసలో మాట్లాడితే బాగుంటుందని రవితేజ కు దర్శకుడు సూచించడంతో..చిత్తూరు యాసను ఇప్పటికే ప్రాక్టీస్ చేస్తున్నాడట రవితేజ.అయితే తన గోదావరి జిల్లా యాస ఎక్కడా కనిపించకుండా తగు జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నాడట. ఇక సినిమాలో చిత్తూరు జిల్లాలో పనిచేసే ఓ గవర్నమెంట్ అధికారిగా కనిపించనున్నాడట రవితేజ.వచ్చే నెలలో ఈ సినిమా షూటింగ్ మొదలు కానున్నట్లు తెలుస్తోంది.ఇక ఈ సినిమాలో రవితేజ సరసన ఇద్దరు హీరోయిన్లు నటించనున్నారు. అందుకు దివ్యాంశ కౌశిక్ ఇప్పటికే ఒక హీరోయిన్ గా ఫిక్స్ కాగా.. మరో హీరోయిన్ పాత్ర కోసం తమిళ సినిమా 'కర్ణన్' లో ధనుష్ కి జోడిగా నటించిన రాజిషా విజయన్ పేరును పరిశీలిస్తున్నట్లు సమాచారం...!!

మరింత సమాచారం తెలుసుకోండి: