బద్రి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన రేణు దేశాయ్ ఆ చిత్రంలో తన నటనతో ఆడియన్స్ ని ఆకట్టుకున్నారు. ఆ తర్వాత జానీ సినిమాలో హీరోయిన్ గా చేశారు.  అప్పటికే పవన్ తో ప్రేమలో పడిన రేణు దేశాయ్ 2009 లో ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. వీరి అపూర్వమైన ప్రేమకు కానుకగా అఖీరా నందన్ (కొడుకు) మరియు ఆద్య (కూతురు) ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే కొంతకాలం వీరి వైవాహిక జీవితంలో మనస్పర్ధలు ఎదురై అవి చివరకు విడాకుల వరకు చేరాయి. అలా 2011లో రేణు దేశాయ్ పవన్ కళ్యాణ్ చట్టబద్ధంగా విడాకులు తీసుకున్నారు. అప్పటి వరకు ఆమె జీవితం ఎలా ఉన్నా ఆ తర్వాత పిల్లలే ఆమె ప్రపంచం అయ్యారు. అఖీరా ఆధ్య లు అంటే ఆమె రెండు కళ్ళుగా బ్రతుకుతున్నారు. తన కొడుకు తండ్రిలాగే సినిమా హీరో అవ్వాలనుకున్నా, ఏ ఇతర రంగంలో అడుగు పెట్టాలి అనుకున్నా తనకు ఎటువంటి అభ్యంతరం లేదని పలు సందర్భాల్లో వ్యక్తపరిచారు రేణు.
2013లో మరాఠిలో శ్రీ ఆద్య ఫిలిమ్స్ బ్యానర్ స్థాపించి నిర్మాతగా మారారు రేణు దేశాయ్. ఆ తర్వాత కొన్ని చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించారు రేణు. ఇష్క్ వాలా అనే సినిమాతో తన తనయుడు అఖీరా నందన్ ను బాలనటుడిగా పరిచయం చేశారు రేణు. ఈ సినిమాకి ఆమె దర్శకురాలిగా మరియు నిర్మాతగా వ్యవహరించడం విశేషం. అయితే సోషల్ మీడియాలో కొద్ది రోజుల నుండి అఖీరా నందన్ హీరోగా ఒక సినిమా రాబోతోందని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు రేణు  దేశాయ్ స్వయంగా నిర్మాతగా వ్యవహరించనున్నట్లు తెలుస్తోంది. అంతే కాకుండా ఈ సినిమాలో అఖీరాతో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నట్లు వినికిడి. మరి ఇందులో రేణు పాత్ర ఏమిటో ? డైరెక్టర్ ఎవరు అన్న విషయాలు ఇంకా తెలియ రాలేదు. 

అయితే ఈ సినిమా ఒక సోషల్ మెసేజ్ నేపథ్యంలో ఉండనుందని సమాచారం. దీనిని బట్టి చూస్తుంటే కొడుకు కూడా తండ్రి బాటలోనే నడుస్తాడా అన్న భావనలు ఫ్యాన్స్ లో కలుగుతున్నాయి. ఈ కరోనా గండం తొలగిపోయిన తరువాత, సినిమాకు సంబంధించిన మిగిలిన వివరాలు తెలిసే అవకాశం ఉంది. ఈ వార్త విన్న పవన్ ఫ్యాన్స్ మరియు రేణు ఫ్యాన్స్ సంతోషంలో మునిగి తేలుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: