యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి తర్వాత తను చేస్తున్న ప్రతి మూవీ నేషనల్ వైడ్ సూపర్ క్రేజ్ తో దూసుకెళ్తుంది. జస్ట్ సినిమా ఎనౌన్స్ మెంట్ తోనే సూపర్ బజ్ ఏర్పరచుకుంటున్న ప్రభాస్ మూవీస్ పోస్టర్స్ తోనే బిజినెస్ దుమ్ముదులిపేస్తున్నాయి. త్వరలో రాబోతున్న రాధే శ్యాం సినిమాతో కూడా ప్రభాస్ రేంజ్ కు తగిన బిజినెస్ జరుగుతున్నట్టు తెలుస్తుంది. ఇక ప్రస్తుతం సర్లార్, అదైపురుష్ రెండు మూవీస్ కు ఈక్వల్ ప్రియారిటీ ఇస్తున్న ప్రభాస్ ఆ మూవీస్ ను పూర్తి చేసి నాగ్ అశ్విన్ సినిమాకు రెడీ అవుతున్నాడు.

నాగ్ అశ్విన్ డైరక్షన్ లో ప్రభాస్ లీడ్ రోల్ గా వస్తున్న ప్రాజెక్ట్ కె మూవీ కోసం ప్రభాస్ భారీగా కాల్ షీట్స్ ఇచ్చేస్తున్నాడని టాక్. ప్రభాస్సినిమా కోసం ఏకంగా 200 రోజుల దాకా డెట్స్ ఇచ్చేసినట్టు చెప్పుకుంటున్నారు. అయితే 200 రోజులకు తగినట్టుగానే భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నట్టు టాక్. ప్రాజెక్ట్ కె కోసం ప్రభాస్ ఏకంగా 200 కోట్ల దాకా పారితోషికం తీసుకుంటున్నాడని లేటెస్ట్ టాక్. అదే నిజమైతే సౌత్ స్టార్స్ లోనే కాదు కాదు ఇండియన్ స్టార్స్ లోనే అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరోగా ప్రభాస్ రికార్డ్ సాధించినట్టే అవుతుంది.

వైజయంతి బ్యానర్ లో వస్తున్న ప్రాజెక్ట్ కె మూవీ లో ప్రభాస్ హాలీవుడ్ స్టార్ రేంజ్ లో కనిపిస్తాడని తెలుస్తుంది. ఈ సినిమాలో దీపిక పదుకొనె ఫీమేల్ లీడ్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. సినిమాలో దీపికతో పాటుగా అక్కినేని కోడలు సమంత కూడా సర్ ప్రైజ్ రోల్ లో నటిస్తుందని అంటున్నారు. 500 కోట్ల భారీ బడ్జెట్ తో వస్తున్న ఈ సినిమాతో ప్రభాస్ క్రేజ్ హాలీవుడ్ రేంజ్ కు వెళ్తుందని అంటున్నారు. ఈ సినిమా ప్రతి విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ అవకుండా ఆడియెన్స్ ను సర్ ప్రైజ్ చేసేలా నాగ్ అశ్విన్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది.  
 


మరింత సమాచారం తెలుసుకోండి: