హాట్ బ్యూటీ కియారా అద్వాని బాలీవుడ్ మూవీ 'ధోని' అన్ టోల్డ్ స్టోరీ తో మంచి క్రేజ్ ని సంపాదించుకుంది. ఆ తర్వాత తెలుగు సినిమా నుండి ఆఫర్లు రావడంతో టాలీవుడ్ వైపు అడుగులు వేసిన ఈ హాట్ బ్యూటీ మొదటి సినిమానే మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన 'భరత్ అనే నేను' మూవీ తో తెలుగు ప్రజలను పలకరించింది. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో ఆ వెంటనే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన 'వినయ విధేయ రామ' సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా బాక్స్ ఆఫీసు వద్ద పెద్దగా ప్రభావం చూపకపోయినా, కియారా అద్వానీ అంద చందాలకు, నటనకు మంచి మార్కులు పడటంతో వరుసపెట్టి తెలుగు సినిమాలలో ఈ ముద్దుగుమ్మ నటిస్తోంది అని అనుకున్నారు.

కాకపోతే కియారా అద్వాని కి బాలీవుడ్ నుండి కూడా మంచి ఆఫర్లు రావడంతో తిరిగి మళ్లీ ముంబై బాట పట్టింది. బాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస సినిమాల్లో నటిస్తూ మంచి క్రేజ్ ను సంపాదించుకున్న ఈ బ్యూటీ బాలీవుడ్ హీరో అయిన సిద్ధార్థ్ మల్హోత్రా తో ప్రేమ వ్యవహారం నడుపుతున్నట్లు కూడా అనేక వార్తలు వచ్చాయి. వెండితెరపై కూడా బెస్ట్ జోడీగా పేరుతెచ్చుకున్న సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా అద్వానీ నిజ జీవితంలో కూడా ఫుల్ క్లోజ్ గా రిలేషన్ షిప్ ను మెయింటైన్ చేస్తూ, పలు పార్టీలకు అటెండ్ అవుతూ ఉంటారు. అయితే ఈ మధ్య ఒక ప్రముఖ ఇంటర్వ్యూలో మాట్లాడిన సిద్ధార్థ్ మల్హోత్రా పెళ్లి విషయం గురించి ఓపెన్ అయ్యాడు. పెళ్లి ఎప్పుడు జరుగుతుందో నాకు తెలియదు. లైఫ్ లో పెళ్లి అనేది చాలా ముఖ్యమైన అంశం. ఒకవేళ నా పెళ్లి సెట్ అయింది అంటే నేనే అందరికీ చెప్తా. పెళ్లి జరగడానికి సరైన సమయం రావాలి అంటూ సిద్ధార్థ్ మల్హోత్రా చెప్పుకొచ్చాడు. సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా అద్వానీ జంటగా నటించిన 'షేర్‌షా' సినిమా ఈ మధ్యే ప్రముఖ 'ఓటిటి' అమెజాన్ ప్రైమ్ లో విడుదలై మంచి ప్రశంసలు దక్కించుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: