ప్రస్తుతం సర్కారు వారి పాట
సినిమా చేస్తున్న మహేష్ బాబు తన తదుపరి చిత్రాన్ని
త్రివిక్రమ్ దర్శకత్వంలో చేయబోతున్నాడు. ఈ చిత్రం డిసెంబర్ లో మొదలు కాబోతోందని వార్తలు వస్తుండగా అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. మరో వైపు మహేష్ బాబు
త్రివిక్రమ్ సినిమాను కాకుండా
రాజమౌళి సినిమాలో మొదటగా మొదలు పెట్టే ఆలోచన చేస్తున్నాడని కొన్ని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎవరి
సినిమా ఎప్పుడు మొదలవుతుందో తెలియక మహేష్ అభిమానులు కొంత అయోమయం లో ఉంటున్నారు.
రాజమౌళి కూడా
ఆర్ఆర్ఆర్ సినిమా పూర్తి చేయనిదే తదుపరి సినిమాకు వెళ్లేలా కనిపించడం లేదు.
త్రివిక్రమ్ కూడా భీమ్లా
నాయక్ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ రెండు సినిమాల పనులు పూర్తి కావడానికి కనీసం రెండు నెలల సమయం అయినా పడుతుంది. అటు మహేష్ బాబు కూడా తను ప్రస్తుతం చేస్తున్న సర్కార్ వారి సినిమాను పూర్తి చేయడానికి రెండు నెలల సమయం కావాలి అంటున్నాడు. ఈ నేపథ్యంలో ఈ ముగ్గురూ ఒకేసారి ఖాళీ అవుతుండడంతో ఎవరితో
సినిమా ఎప్పుడూ ఉంటుంది అనే ప్రశ్న కూడా అందరిలో మెదులుతుంది.
మరోవైపు ఈ రెండు సినిమాలు ఒకేసారి మొదలుపెట్టి సమాంతరంగా తెరకెక్కించే ఆలోచనలో ఉన్నాడట మహేష్ బాబు. మరి ఇది ఎంతవరకు సాధ్యం అవుతుందో చూడాలి. అయితే మహేష్ బాబు
రాజమౌళి సినిమాకు కథ సెట్ కాలేదని ఏ స్టోరీ చెప్పిన మహేష్ బాబు ఓకే చేయడం లేదని వార్తలు వస్తూ ఉడగా దీనిపై క్లారిటీ ఇవ్వాలని అభిమానులు కోరుతున్నారు. నిజానిజాలు ఎంత వరకు ఉన్నాయో తెలియడం లేదు కాబట్టి దీనిపై స్టేట్మెంట్ ఇస్తే ఇంకా మంచిది అని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో అభిమానుల కోరిక మేరకు
రాజమౌళి కానీ మహేష్ కానీ తమ కాంబినేషన్ లో
సినిమా గురించి ఏదైనా అఫీషియల్ ప్రకటన ఇస్తారో చూడాలి.
సంక్రాంతి కానుకగా తన సర్కారు వారి పాట సినిమాని విడుదల చేయాలని మహేష్ ప్లాన్ సిద్ధం చేసుకున్నాడు.
కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి
తమన్ సంగీతం సమకూర్చాడు.