900 చిల్లర ఓట్లకు 600 చిల్లర ఓట్ల పోలింగ్‌ జరగడం. వీటి కౌంటింగ్‌ జరగడానికి ఎంత టైమ్‌ పడుతుంది.మహా అయితే ఒక పూట పడుతుందని కానీ ఆ ఓట్ల లెక్కింపు రెండు రోజులు జరుగుతుందని అందరూ ట్రోల్ చేస్తున్నట్లు సమాచారం.

అందులోనూ ముందు రోజు 'గెలిచారు' అంటూ వార్తలొచ్చిన వాళ్లు రెండో రోజుకు వచ్చేసరికి ఓడిపోయారని అసలు వారు గెలిచారా లేక ఓడారా అనే ఊసేలేని ఇంకొంతమంది రెండో రోజు విజయగర్వంతో స్టేజీ మీద చప్పట్ల మోత మోగించారని తెలుస్తుంది. అసలు 'మా' కౌంటింగ్‌లో ఏం జరిగిందో తెలుసా..

మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ (మా) ఎన్నికలు అక్టోబరు 10న సాయంత్రం మూడు గంటల వరకు జరిగాయని అందరికి తెలుసు మూడున్నర ఆ సమయంలో ఈసీ సభ్యుల కౌంటింగ్‌ మొదలైందని తెలుస్తుంది.అక్కడికి ఓ అరగంటకే తొలి ఫలితాలు వచ్చేశాయని అందులో వచ్చిన పేర్లలో నటి మరియు యాంకర్‌ అనసూయ ఒకరని భారీ ఆధిక్యంతో అనసూయ గెలిచింది అంటూ టీవీలు, వెబ్‌సైట్లు ఊదరగొట్టాయని అందరికి తెలుసు.. కానీ అక్టోబరు 11న సాయంత్రం ప్రకటించిన ఫలితాల్లో ఆమె పేరు లేదని తెలుస్తుంది.ఈ విషయాన్ని ఆమె బహిరంగంగానే ప్రశ్నించారని సమాచారం. అస్సలు భారీ విజయం అని అన్నారు.రెండోరోజు నా పేరు లేదు అంటూ వ్యంగ్యంగా ట్వీట్లు చేశారని తెలుస్తోంది.

అయితే తొలి రోజు వచ్చిన వార్తలు కరెక్ట్‌ కాదు అనుకుంటే తొలి రోజు వచ్చిన చాలా ఫలితాలు అలానే ఉన్నాయి కదా అని ప్రశ్నించింది. అసలు 654 ఓట్ల లెక్కింపు కోసం రెండో రోజు కూడా కేటాయించడం ఎందుకు అనేదే ఇక్కడ ప్రశ్న అని తెలుస్తుంది. తొలి రోజు ఈసీ సభ్యల ఓట్ల లెక్కింపు తర్వాతే మిగిలినవి లెక్కించారు కదా అని ఇక వైస్‌ ప్రెసిడెంట్‌ పదవి కోసం జరిగిన పోటీలో బెనర్జీ ఓడిపోయారు అంటూ వార్తలొచ్చాయని తెలుస్తుంది. మాదాల రవిపై ఆయన ఓటమి పాలయ్యారని అన్నారని సమాచారం.కానీ రెండో రోజు చూస్తే బెనర్జీ ఘనవిజయం అంటూ చెప్పుకొచ్చారని  అలాగే తొలి రోజు లెక్కింపులో హేమ గెలిచారు అని ఒకసారి అలాగే ఓడిపోయారు అని ఒకసారి అన్నారని తెలుస్తుంది.

దాని మీద క్లారిటీ రెండో రోజు వచ్చిన కూడా అసలు తొలి రోజు లెక్కింపులో లీకులు ఇచ్చిందెవరు అలాగే ఆ లీకులతో జనాల్ని కన్‌ఫ్యూజ్‌ చేసింది ఎవరు. ఇక్కడే మరో విషయం కూడా గుర్తుంచుకోవాలని తెలుస్తుంది.నిన్న ప్రెస్‌మీట్‌లో కూడా మంచు విష్ణు ఇదే మాట చెప్పుకొచ్చారని తెలుస్తుంది. అసలు 'మా' అధ్యక్ష పదవి కోసం జరిగిన పోలింగ్‌ ఓట్ల లెక్కింపు మొదలుకాకుండా కొన్ని టీవీ ఛానళ్లు 400కుపైగా ఓట్ల తేడాతో విష్ణు గెలిచాడు అంటూ ఊదరగొట్టాయని తెలుస్తుంది.. ఈ ప్రచారం తర్వాత ఎప్పుడో గంట తర్వాత కౌంటింగ్‌ మొదలైందని తెలుస్తుంది. విష్ణు 100కుపైగా ఓట్ల తేడాతో గెలిచాడని మరి ఆ 300 ఓట్ల లెక్కేంటి. 'మా' కౌంటింగ్‌లో మతలబు జరిగిపోయిందా లేక టీవీ మీడియా మతలబా అనేది తెలియాల్సి ఉందని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: