బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న 'కౌన్ బనేగా కరోడ్పతి' గేమ్ షో కి ప్రేక్షకుల్లో ఎలాంటి ఆదరణ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సామాన్యులను కోటీశ్వరులుగా మార్చేసిన గేమ్ షో ఇది. దీంతో ఈ షోకి జనాల్లో ఫుల్ క్రేజ్ ఉంది. కేవలం ప్రశ్నలతోనే కాకుండా సామాన్య ప్రజల జీవితాలకు సంబంధించిన ఆసక్తికర విషయాలను సైతం అందరికి తెలియజేస్తూ అమితాబచ్చన్ ఈ షోను ముందుకు నడిపిస్తున్నారు. విజ్ఞానంతో పాటు వినోదానికి కూడా ఈ షోలో ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. ఇక సామాన్యుల తో పాటు అప్పుడప్పుడు సినీ ప్రముఖులు కూడా వస్తుంటారు. తాజాగా ఈ షోకి బాలివుడ్ యాక్షన్ హీరో జాన్ అబ్రహం రావడం జరిగింది.

 తాను హీరోగా నటించిన తాజా చిత్రం 'సత్యమేవజయతే 2' ప్రమోషన్స్లో భాగంగా సినిమా హీరోయిన్ దివ్యా ఖోస్లా కుమార్‌ తో కలిసి ఈ షోలో పాల్గొన్నారు జాన్ అబ్రహం. తాజాగా అందుకు సంబంధించిన ప్రోమో విడుదలైంది. ఇక ప్రోమోలో బాలీవుడ్ లో యాక్షన్ హీరోగా పేరు తెచ్చుకున్న జాన్ అబ్రహం తన నైపుణ్యాన్ని ప్రదర్శించాడు. ఈ క్రమంలోనే తన సినిమాలోని కొన్ని యాక్షన్ సీక్వెన్స్ లను అనుకరించి చూపించాడు. అందులో వేలిపై ఫుట్బాల్ ని గిరగిరా తిప్పి ఆకట్టుకున్నాడు. అయితే అదే ప్రయత్నాన్ని అమితాబచ్చన్ చేయగా ఆయన ఫెయిల్ అయ్యాడు. ఇక ఆ తర్వాత తన టీ షర్ట్ లేపి సిక్స్ ప్యాక్ ను చూపించగా షోలో అందరూ గట్టిగా అరిచారు.

 ఇక ఆ తర్వాత ఆమె అమితాబ్ బచ్చన్తో ధూమ్ సినిమా విశేషాల గురించి పంచుకున్నాడు.' ధూమ్ సినిమా రిలీజ్ అయిన తర్వాత నేను బైక్ పై వచ్చి మిమ్మల్ని కలిశాను. అప్పుడు మీరు అభిషేక్ను బైక్ విషయంలో ప్రోత్సహించవద్దని నాతో అన్నారు. ఇక అదే సమయంలో అభిషేక రావడం గమనించి బైక్ బాగుంది అని మాట మార్చారని' చెప్పాడు జాన్ అబ్రహం. అయితే ఇక్కడి వరకు బాగానే ఉన్నా ఈ ప్రోమో ఎండింగ్లో ఏదో బాధ కలిగించిన విషయం గురించి మాట్లాడుతూ జాన్ అబ్రహం కన్నీళ్లు పెట్టుకున్నాడు. అతన్ని చూసిన అమితాబ్ బచ్చన్ తో పాటు షో లో ఉన్న వాళ్ళందరూ బాధపడ్డారు. అయితే ఈ హీరో దేని గురించి బాధపడ్డాడో మాత్రం ఈ ప్రోమో లో చూపించలేదు. మరి దాని గురించి తెలియాలంటే నవంబరు 26న ప్రసారమయ్యే ఈ ఫుల్ ఎపిసోడ్ ని చూడాల్సిందే...!!

మరింత సమాచారం తెలుసుకోండి: