సినీ ఇండస్ట్రీలో ఉండేటువంటి హీరోలు, హీరోయిన్స్, డైరెక్టర్ వంటివారికి, ఏదో ఒక సందర్భంలో కోపంలో ఏదో ఒక గొడవ పడుతూ ఉంటారు. ముఖ్యంగా ఏదైనా సీన్ జరిగేటప్పుడు పొరపాటు జరిగితే డైరెక్టర్ హీరో హీరోయిన్ల ను అరుస్తూ ఉంటాడు. ఇక ఓకే సన్నివేశాన్ని ప్రతిసారి తీస్తుంటే నటీనటులకు కూడా ఆ డైరెక్టర్ మీద చాలా కోపం వస్తూ ఉంటుంది. అలా ఒకసారి మన టాలీవుడ్ హీరో ఒక డైరెక్టర్ మీదకోపడ్డాడట. వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.


అసలు విషయంలోకి వెళ్తే..ఆ హీరో ఎవరో కాదు హీరో శ్రీకాంత్. మొదటిసారిగా సినీ ఇండస్ట్రీలోకి..1991 లో వచ్చిన పీపుల్ ఎన్ కౌంటర్ అనే మూవీతో తన కెరీర్ ని మొదలు పెట్టాడు హీరో శ్రీకాంత్. ఈ హీరో కూడా మొదటిసారిగా విలన్ గా నటించాడు. ఆ తర్వాత నిదానంగా హీరోగా తన పేరును సంపాదించారు. అలా ఎన్నో సంవత్సరాల గ్యాప్ తర్వాత మరి ఇప్పుడు విలన్ గా నే ఎంట్రీ ఇచ్చాడు. అఖండ మూవీలో వరదరాజులు అనే క్యారెక్టర్ లో బాగానే ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ప్రముఖ ఛానల్ కు  గెస్ట్ గావచ్చిన ఈయన అందులో కొన్ని విషయాలను తెలియజేశాడు. ఇక ఈ హీరోతో పాటు, హీరోయిన్ పూర్ణ కూడా గెస్ట్ గా వచ్చింది.

ఇక అలీ తో కలిసి కొన్ని విషయాలను తెలుపుతూ ఉండగా.. ఆలీ మాట్లాడుతూ మీరు ఒక డైరెక్టర్ మీద కో పడ్డాడట అసలు కారణం ఏమిటి అని అడుగగా.. శ్రీకాంత్ మాట్లాడుతూ తను ఎంతో కష్టపడి ప్రాక్టీస్ చేసి..BGM మూమెంట్ చేశానని, డైరెక్టర్ ఇది కాదు వేరే మూమెంట్ అని చెప్పడంతో అది కూడా చేశాను అని, అలా విసిగిస్తూ 6 సార్లకు పైగా నే తన మూమెంట్ ను మార్చారట. అలా విసుగొచ్చి అక్కడున్న కొన్ని వస్తువులను పగలకొట్టి వెళ్లిపోయాడని తెలియజేశాడు. ఇక అందులో హీరోయిన్గా రాసి నటించిందని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: