విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం చేస్తున్న చాలా సినిమాలను ఓ టీ టీ లోనే విడుదల చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నాడు. ఆయన నటించిన నారప్ప మరియు దృశ్యం 2 సినిమాలు ఓ టీ టీ లోనే విడుదల కాగా అవి ప్రేక్షకులను విపరీతంగా అలరించగా అవి ఆయన కెరియర్ లోనే సూపర్ హిట్ సినిమాలు నిలిచాయి. అయితే వెంకీ ఇలా వరుస పెట్టి తన సినిమా లను ఓ టీ టీ లో విడుదల చేయడానికి కారణం లేకపోలేదు. తన సినిమాను థియేటర్లలో విడుదల చేస్తే ప్రేక్షకులు సినిమా థియేటర్ కి రాక పోవడం మాత్రమే కాకుండా సినిమా కు భారీగా నష్టాలు చవిచూడాల్సి వస్తుందని ఆయన ఈ విధమైన డెసిషన్ తీసుకున్నారు.

దాంతో రిస్క్ ఎందుకు అని భావించి ఆయన నటించిన కొన్ని సినిమాల ను ఓ టీ టీ లో ఎలాంటిది రిస్క్ లేకుండా విడుదల చేస్తూ ప్రేక్షకులను ఆలరిస్తున్నారు విక్టరీ వెంకటేష్. అలా తన సినిమాలను ఓటిటీ లో విడుదల చేస్తూ సూపర్ హిట్ కొట్టి ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇక ప్రస్తుతం ఆయన వరుణ్ తేజ్ తో కలిసి చేస్తున్న ఎఫ్3 సినిమా కూడా ఓటీటీ లో విడుదల అవుతుందా అనేది చూడాలి. ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. 

ఇదిలా ఉంటే వెంకీ బాట లో మరో హీరో ఇప్పుడు వెలుతుండడం అందరినీ ఎంతగానో ఆశ్చర్యపరుస్తుంది.  అక్కినేని నాగచైతన్య హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో థాంక్యూ అనే చిత్రాన్ని చేస్తున్నారు. ఈ సినిమా లో రాశి కన్నా హీరోయిన్ గా నటిస్తుండగా ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ దాదాపు పూర్తి అయిన నేపథ్యంలో త్వరలోనే ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాను ఓ టీ టీ లో విడుదల చేస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచన కూడా చేస్తున్నారట. దీనికి సంబంధించిన రేటు భారీగా పలికితే మాత్రమే ఈ సినిమాను విడుదల చేయడం ఖాయమని అంటున్నారు. అఖండ సినిమా విజయవంతం అయిన నేపథ్యంలో థియేటర్లో ప్రేక్షకులు వస్తున్న నేపథ్యంలో ఈ సినిమా థియేటర్లలో విడుదల చేస్తారా అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: