తొలిసారిగా ప్రభాస్ హీరోగా తెరకెక్కిన మిర్చి సినిమా ద్వారా దర్శకుడిగా మెగా ఫోన్ పట్టిన కొరటాల శివ అంతకముందు పలు సక్సెస్ఫుల్ సినిమాలకు కథకుడిగా పని చేసారు. ఇక ప్రభాస్ తో తీసిన మిర్చి మూవీ తో పెద్ద హిట్ కొట్టిన శివ, అనంతరం ఏకంగా సూపర్ స్టార్ మహేష్ తో శ్రీమంతుడు రూపంలో అతి పెద్ద ఇండస్ట్రీ హిట్ అందుకున్నారు. ఆపైన ఎన్టీఆర్ తో జనతా గ్యారేజ్, అలానే మరొక్కసారి మహేష్ తో భరత్ అనే నేను వంటి మరొక రెండు సూపర్ హిట్స్ సొంతం చేసుకున్న కొరటాల శివ ప్రస్తుతం చిరు, చరణ్ లతో ఆచార్య అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.
ఎంతో భారీగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఏప్రిల్ 1న విడుదల కానుంది. అయితే విషయం ఏమిటంటే, దీని తరువాత ఎన్టీఆర్ నటించబోయే 30వ సినిమాని కూడా శివ తీయనున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధా ఆర్ట్స్ సంస్థలపై ఈ సినిమా రూపొందనుండగా దీనిని మార్చిలో పట్టాలెక్కించనున్నట్లు టాక్. అనంతరం సూపర్ స్టార్ మహేష్ తో కూడా ముచ్చటగా మూడవ కాంబినేషన్ మూవీని తీసేందుకు కొరటాల శివ ప్లాన్ చేస్తున్నారట. ఇప్పటికే మహేష్ కోసం అద్భుతమైన స్టోరీ సిద్ధం చేస్తున్న శివ, త్వరలో దానిని ఆయనకి వినిపించి ఆమోదం అందుకోనున్నారట. ఇక ఇటీవల అల్లు అర్జున్ తో కూడా కొరటాల శివ ఒక సినిమా చేయనున్నట్లు అధికారిక ప్రకటన కూడా వచ్చింది. గీతా ఆర్ట్స్, యువ సుధా ఆర్ట్స్ సంస్థలపై ఈ సినిమా రూపొందనున్నట్లు పోస్టర్లు కూడా రిలీజ్ అయ్యాయి.

అయితే ఆ తరువాత అల్లు అర్జున్ పుష్పతో అలానే కొరటాల ఆచార్య తో బిజీ కావడంతో ఈ సినిమా కొంత వెనక్కి వెళ్ళింది. ఇక లేటెస్ట్ టాలీవుడ్ వర్గాల న్యూస్ ప్రకారం ఎన్టీఆర్ 30 తరువాత పక్కాగా మహేష్ తో ఒక సినిమా, ఆపైన అల్లు అర్జున్ తో సినిమాలను కొరటాల చేయనున్నారని, ఈమేరకు ఆయన మూడు పవర్ఫుల్ స్టోరీస్ సిద్ధం చేస్తున్నారట. అన్ని అనుకున్నట్లు జరిగితే ఈ ముగ్గరు బడా స్టార్స్ తో మరొక ఏడాదిన్నరలో ఇవి మూడు ఫినిష్ అయ్యేలా ఆయన ప్లాన్ చేస్తున్నాని, ఒకవేళ కొరటాల టైం కలిసి వచ్చి ఇవి మూడు సక్సెస్ అయితే దర్శకుడిగా ఆయన రేంజ్ అమాంతం పెరగడం ఖాయం అంటున్నారు విశ్లేషకులు. ఆ విధంగా వరుసగా ముగ్గురు బడా స్టార్స్ ని పట్టేసిన కొరటాల శివ, వారితో ఎంత మేర సక్సెస్ లు కొడతారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: