టాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ లలో ఇప్పుడు బాగా ట్రెండింగ్ లో ఉన్న సమంత గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు. సమంత `ఏ మాయ చేశావే` వంటి సూపర్ హిట్ సినిమాతో సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి.. అతి తక్కువ కాలంలోనే తనకంటూ ఒక ప్రత్యేకత ను ఎర్పరుచుకుంది. అయితే తెలుగు, తమిళ్ భాషల్లోనూ ఎన్నో విజయవంతమైన చిత్రాలు చేసిన ఈ భామ.. 2017లో తన తొలి సినిమా హీరో అయిన అక్కినేని నాగచైతన్యను ప్రేమ వివాహం చేసుకుంది. వీరి వివాహం గోవాలో అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. కానీ పెళ్లై పట్టున నాలుగేళ్లు కూడా గడవక ముందే ఈ జంట వైవాహిక జీవితానికి స్వస్తి పలకడం అందరిని బాధకి గురిచేసింది.

అయితే ప్రస్తుతం కెరీర్ పైనే దృష్టి పెట్టిన సమంత.. ఇప్పుడు తాజాగా ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. అదేంటంటే.. సెకెండ్ ఫీమేల్ లీడ్ రోల్ కానీ, నటనకు అంత ఆస్కారం లేని పాత్రలు వస్తే మాత్రం ససేమిరా అలాంటి పాత్రను చేయకూడని నిశ్చయించుకున్నారట. నిజంగా ఈ నిర్ణయం కొందరి డైరెక్టర్స్ కు షాక్ అనే చెప్పాలి. అంతేకాదు ఇటీవల అటువంటి పాత్రలు వచ్చినా కూడా నిర్మొహమాటంగా నో చెప్పేసింది. భారీ కమర్షియల్ సినిమాల్లో అయితే తప్పకుండా నటిస్తానని చెబుతోందట. మరి ఈమె తీసుకున్న నిర్ణయం ఎంత వరకు నిజమో తెలియాదు గానీ.. ఇప్పుడు ఈ వార్త మాత్రం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

ఇక సినిమాల విషయానికి వస్తే.. సమంత ఇప్పటికే గుణశేఖర్ దర్శకత్వంలో `శాకుంతలం` అనే సినిమాను పూర్తి చేయగా. తర్వాత శ్రీదేవి మూవీస్ బ్యానర్‌పై హరీష్ దర్శకత్వంలో సీనియర్ నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మిస్తున్న `యశోద`లో నటించింది. ఈ రెండూ కూడా పాన్ ఇండియా చిత్రాలే. కాగా అతి త్వరలోనే విడుదలకు సిద్దంగా ఉన్నాయి. ఇక అలాగే ఈ బ్యూటీ మరో వైపు విజయ్ దేవరకొండ సరసన `ఖుషీ` అనే లవ్ స్టోరీ కూడా చేస్తోంది. ఇక వీటితో పాటు సమంత చేతిలో మరికొన్ని ప్రాజెక్ట్స్ సైతం ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: