గతంలో ఈటీవీ లో ప్రసారమయ్యే డ్యాన్స్ రియాలిటీ షో ఢీ లో జడ్జిగా ప్రత్యక్షమైన పూర్ణ ప్రేక్షకులందరిని కూడా అలరించింది. ఏకంగా తనకు డాన్స్ పర్ఫార్మెన్స్ బాగా నచ్చితే హగ్ ఇవ్వడంతో పాటు ఏకంగా చెంప కొరకడం లాంటివి చేసి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి. ఇక ఇటీవల శ్రీదేవి డ్రామా కంపెనీ అనే కార్యక్రమంలో ప్రత్యక్షమైంది పూర్ణ. ఇటీవలే విడుదలైన శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.
ఇప్పుడు ప్రోమో చూసుకుంటే ఇంద్రజ ప్లేస్ లో పూర్ణ వచ్చినట్లు తెలుస్తోంది. ఎప్పటిలాగానే ప్రోమో ఎంతో సందడిగా సాగిపోయింది. కానీ చివర్లో జబర్దస్త్ కమెడియన్ ఇమ్మానియేల్ స్టేజి మీద ఉన్న పూర్ణ చేయి పట్టుకుంటాడు. దీంతో పూర్ణ ఒక్కసారిగా షాక్ అయి తన చేతిని వెనక్కి తీసుకుంటుంది. ఏంటిది ఇలా చేశావు అంటూ అడుగుతుంది. నువ్వు నా పర్మిషన్ లేకుండా ఎలా నన్ను చేసావ్ అంటూ సీరియస్ అవుతుంది. ఇక ఆ తర్వాత ఎంతో కోపంగా ఇమ్మానియేల్ ని చూస్తూ స్టేజ్ దిగి వెళ్ళిపోతుంది పూర్ణ. దీంతో ఇది నిజం గానే జరిగిందా లేదా స్క్రిప్టులో భాగంగానే అన్న విషయంపై నెటిజన్లు అందరూ చర్చించుకుంటున్నారు అని చెప్పాలి..