బాలీవుడ్‌ - దేవిశ్రీప్రసాద్‌.. చాలా రోజులుగా ఈ కాన్సెప్ట్‌ రన్నింగ్‌లో ఉంటూనే ఉన్నది.. ఓ సినిమాకు దేవిశ్రీప్రసాద్‌ను పూర్తి స్థాయి మ్యూజిక్‌ డైరక్టర్‌గా తీసుకుంటారు అని అనుకోవడం, అంతలోనే లేదు అనుకోవడం జరిగిపోతూనే ఉంటాయి.


పూర్తి స్థాయి అంటే కేవలం పాటలకే. కానీ ఏమౌతోందో ఏమో కానీ, డీఎస్పీ ఆ సినిమా నుండి బయటకు వచ్చేస్తున్నాడట.. తాజాగా మరోసారి అదే పని జరిగింది అని చెబుతున్నారు. సల్మాన్‌ ఖాన్‌ - పూజా హెగ్డే ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం 'కబీ ఈద్‌ కబీ దివాళీ'. ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోందట.


ఈ క్రమంలో దేవిశ్రీప్రసాద్‌ సినిమా కోసం సిద్ధం చేసిన ట్యూన్స్‌ని సల్మాన్‌కు కొన్ని వినిపించాడట. అయితే వర్క్‌ పట్ల సల్మాన్‌ సంతృప్తి వ్యక్తం చేయలేదని సమాచారం. ఈ నేపథ్యంలో సినిమా నుండి దేవి తప్పుకున్నట్లు వార్తలొస్తున్నాయి. అంతేకాదు అతని స్థానంలో 'కేజీయఫ్‌' సంగీత దర్శకుడు అయిన రవి బ్రసూర్‌ సినిమాలోకి వచ్చారని టాక్. 'పుష్ప' సినిమాలోని పాటలు, అంతకుముందు వర్క్‌ చూసి దేవిశ్రీప్రసాద్‌కి సల్మాన్ సినిమా ఛాన్స్‌ ఇచ్చారని అందరు అంటారు. గతంలో దేవి ట్యూన్స్‌కి సల్మాన్‌ స్టెప్పులేశాడు కూడా.


 


మరిప్పుడు ఈ పాటలు నచ్చలేదు అంటే ఆలోచించాల్సిందే. 'రాధే' సినిమాలో 'డీజే'లోని 'సీటీమార్‌..' పాటను కూడా తీసుకున్నారు. 'రెడీ'లో తెలుగు 'రెడీ'లోని 'డింక్‌చకా' అంటూ 'రింగ రింగ' ట్యూన్‌ తీసుకున్నారు. 'జైహో'లో అయితే 'నాచో రే..' అనే ట్యూన్‌ కూడా చేశారు దేవీ. ఇక 'కబీ ఈద్‌ కబీ దివాళీ' సినిమా సంగతికొస్తే. తమిళంలో అజిత్‌ చేసిన 'వీరమ్‌' సినిమాకు ఇది రీమేక్‌. తెలుగులో 'కాటమరాయుడు'గా వచ్చింది కూడా అదే.


 


హిందీ వెర్షన్‌లో పూజా హెగ్డే సోదరుడిగా వెంకటేశ్‌ నటిస్తున్నారు. అలాగే రామ్‌చరణ్‌ ఓ పాటలో సల్మాన్‌ ఖాన్‌తో కలసి స్టెప్పులేశారని టాక్‌. మరి ఇప్పుడు దేవి ట్యూన్స్‌ తీసుకోకపోవడంతో మరోసారి ఆ పాటను చిత్రీకరిస్తారేమో మరి చూడాలి. అయితే దేవి సినిమా నుండి తప్పుకోవడంపై చిత్రబృందం నుండి ఎలాంటి అధికారిక సమాచారం అయితే లేదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: