స్టార్ హీరోయిన్ సమంత మరో సారి వార్తల్లో నిలిచింది.ఇక  మయో సైటిస్ అని దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్న సమంత ప్రస్తుతం పూర్తిగా విశ్రాంతి తీసుకుంటుంది.అయితే వైద్యుల పర్యవేక్షణలో ఆమె ఉందని.. ప్రస్తుతం సామ్ బాగానే ఉందని ఇప్పటికే ఆమె తరపు వారు పేర్కొన్నారు. ఇక ఆ మధ్య యశోద సినిమా కు సంబంధించిన పనులను డాక్టర్ల సమక్షం లో చేసింది. కాగా డబ్బింగ్ చెప్పే సమయం లో కూడా సమంత తీవ్ర అనారోగ్య సమస్య లతో బాధపడుతుందని వార్తలు వచ్చాయి. సినిమా కోసం ఒక ఇంటర్వ్యూ ఇచ్చి అందరి దృష్టిని ఆకర్షించింది. 

సమంత అనారోగ్య సమస్య గురించి తమిళ సోషల్ మీడియా లో మరియు తమిళ్ మెయిన్ స్ట్రీమ్ మీడియా లో రకరకాల పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇక మరో సారి తమిళ తంబీలు సమంత ఆరోగ్య విషయం లో అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. అయితే తాజాగా తమిళ మీడియా లో వచ్చిన కథనాలు సమంత అభిమానులకు ఆందోళన కలిగిస్తున్నాయి.ఆరోగ్యం క్షీణించిందని, దాంతో హైదరాబాదులోని ప్రముఖ హాస్పిటల్ లో జాయిన్ చేశారని అత్యవసర చికిత్స ను సమంత కు వైద్యులు అందజేస్తున్నారని ఆ కథనాల్లో తమిళ్ మీడియా పేర్కొంది.ఇక  దాంతో తమిళనాడు కు చెందిన సమంత అభిమానులు ఆందోళన వ్యక్తం చేశారు.

 సమంత అభిమానులతో పాటు ప్రతి ఒక్కరు కూడా జరుగుతున్న ప్రచారం ని తిప్పి కొట్టే ప్రయత్నం చేశారు.ఇక  సమంత మేనేజర్ ఈ విషయమై క్లారిటీ ఇచ్చారు. ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని.. ఇకపోతే హాస్పిటల్లో జాయిన్ అయి చికిత్స పొందుతున్నట్లుగా వస్తున్న వార్తల్లో నిజం లేదని పేర్కొన్నారు.ఇక  సమంత ఆరోగ్యం గురించి ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వారు కథనాలు ప్రచారం చేయొద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. ఇంట్లోనే ఉండి విశ్రాంతి తీసుకుంటుంది. కొన్నాళ్లయితే షూటింగ్ లతో బిజీ అవుతుందని.. అభిమానులతో పాటు ఇండస్ట్రీ వర్గాల వారు భావిస్తున్నారు. ఇక మేనేజర్ తాజా మాటలతో అది నిజమని తేలి పోయింది.కాగా  తమిళ తంబీలు సమంత అనారోగ్యం తో ఉన్నప్పటికీ వదలడం లేదంటూ ఆమె అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: