మెగాస్టార్ చిరంజీవి తాజాగా పక్క మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ అయినటువంటి వాల్తేరు వీరయ్య లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసింది. ఈ మూవీ కి బాబీ దర్శకత్వం వహించగా , శృతి హాసన్ ఈ సినిమాలో చిరంజీవి సరసన హీరోయిన్గా నటించింది. మైత్రి సంస్థ వారు నిర్మించిన ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించగా , రవితేజ ఒక కీలకమైన పాత్రలో నటించాడు. కేథరిన్ ఈ మూవీ లో రవితేజ కు భార్య పాత్రలో నటించగా , ప్రకాష్ రాజ్ , బాబి సింహమూవీ లో విలన్ పాత్రలలో నటించారు. ఈ మూవీ జనవరి 13 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల అయ్యి బ్లాక్ బస్టర్ టాక్ ను సొంతం చేసుకుంది. దానితో ఈ మూవీ కి ప్రపంచవ్యాప్తంగా అదిరిపోయే రేంజ్ కలెక్షన్లు లభిస్తున్నాయి.

మూవీ ఇప్పటివరకు 8 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుంది. ఈ 8  రోజుల్లో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఏ ఏరియాలో ఏ రేంజ్ కలెక్షన్లను అందుకుందో తెలుసుకుందాం. 8 రోజుల్లో ఈ మూవీ నైజాం ఏరియాలో 27.7 కోట్లు , సీడెడ్ లో 14.87 కోట్లు , యు ఏ లో 12.29 కోట్లు , ఈస్ట్ లో 8.75 కోట్లు , వెస్ట్ లో 4.86 కోట్లు , గుంటూరులో 6.43 కోట్లు , కృష్ణ లో 6.16 సిక్స్ కోట్లు , నెల్లూరు లో 3.18 కోట్లు , కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో 6.40 కోట్లు , ఓవర్సీస్ లో 11.05 కోట్లు మొత్తంగా ఈ సినిమాకు 8 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి ప్రపంచ వ్యాప్తంగా 101.16 కోట్ల షేర్ , 173.35 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు లభించాయి. ఇలా ఇప్పటికే ఈ సినిమా 100 కోట్ల షేర్ మార్క్ ను బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకోని బ్లాక్ బస్టర్ విజయం సాధించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: