మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఆరు పదుల వయసులో కూడా వరుస పెట్టి సినిమాలు చేస్తూ కుర్ర హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నారు. అంతేకాదు తమ సినిమాల విజయాలతో తమ స్ట్రాటజీ ఏంటో చూపిస్తూ దూసుకుపోతున్నారని చెప్పవచ్చు. ఒకవైపు చిరంజీవి మరొకవైపు బాలకృష్ణ ఇద్దరూ కూడా తమ పూర్వ జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ పోటీపడి మరి సినిమాలను తెరకెక్కిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి సంక్రాంతి పండుగ సందర్భంగా రిలీజ్ చేసిన చిత్రం వాల్తేరు వీరయ్య.. జనవరి 13వ తేదీన విడుదలైన ఈ సినిమాను movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ వారు భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు.


సినిమా విడుదలైన మొదటి రోజే మొదటి షో తో మంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుని.. భారీ కలెక్షన్స్ వసూలు చేసింది. అంతేకాదు సినిమా విడుదలైన మూడు రోజుల్లోనే రూ.108 కోట్ల కలెక్షన్స్ వసూలు చేసి అరుదైన రికార్డు సృష్టించింది ఈ సినిమా. అంతే కాదు యూ ఎస్ ఏ లో కూడా 2 మిలియన్ డాలర్ మార్కును కూడా దాటేసి మరో రికార్డు సృష్టించింది. ఇదిలా ఉండగా ఈ సినిమాలో హీరోయిన్గా శృతిహాసన్ నటించిన విషయం తెలిసిందే. ఇకపోతే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాను తమిళ్లో డబ్బింగ్ చేసి విడుదల చేయబోతున్నట్లు గతంలో స్పష్టం చేసిన విషయం తెలిసిందే.

ఇప్పుడు తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమాను తమిళ్లో డబ్బింగ్ చేసి ఫిబ్రవరి ఒకటో తారీకు రిలీజ్ చేయడానికి సన్నాహాలు సిద్ధం చేస్తున్నారు. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు కానీ ఈ డేట్ ను ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది.. మరో పక్క చిరంజీవి తాను నటించినా భోళా శంకర్ సినిమాలో కూడా విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నాడు.  ఈ సినిమా తర్వాత వివి వినాయక్ డైరెక్షన్లో మరో సినిమా కూడా చేయబోతున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: