తెలుగు సినిమా ఇండస్ట్రీలో సూపర్ క్రేజ్ ఉన్న సీనియర్ స్టార్ హీరోలలో మెగాస్టార్ చిరంజీవి ఒకరు. మెగాస్టార్ చిరంజీవి కొన్ని సంవత్సరాల పాటు సినిమాలకు దూరంగా ఉండి రాజకీయాలపై దృష్టి పెట్టిన విషయం అందరికీ తెలిసిందే. ఆ తర్వాత ఖైదీ నెంబర్ 150 మూవీతో చిరంజీవి సినిమా ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇచ్చారు.  ఖైదీ నెంబర్ 150 మూవీతో బాక్స్ ఆఫీస్ దగ్గర అదిరిపోయే రేంజ్ కలెక్షన్లను అందుకొని తన స్టామినాన్ని మరోసారి బాక్స్ ఆఫీస్ దగ్గర నిరూపించుకున్నాడు.

ఆ తర్వాత ఇప్పటికే ఎన్నో సినిమాలలో నటించిన చిరంజీవి తాజాగా ఈ సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదల అయిన వాల్తేరు వీరయ్య మూవీతో అద్భుతమైన విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్నాడు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం చిరంజీవి "భోళా శంకర్" అనే మూవీలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ తమిళ సూపర్ హిట్ మూవీ వేదాలం కు అధికారికంగా రూపొందుతుంది. ఈ సినిమాలో మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్గా నటిస్తూ ఉండగా , మెహర్ రమేష్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. కీర్తి సురేష్ ఈ మూవీలో చిరంజీవికి చెల్లెలు పాత్రలో నటిస్తోంది.

ఇది ఇలా ఉంటే ఈ మూవీ ని ఆగస్టు 11వ తేదీన థియేటర్లో విడుదల చేయనున్నట్లు ఈ చిత్ర బృందం కొన్ని రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించింది. ఇంతకు ముందే ఈ తేదీన మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ ని విడుదల చేయనున్నట్లు ఈ చిత్ర బృందం ప్రకటించింది. అలాగే రజనీ కాంత్ హీరోగా రూపొందుతున్న జైలర్ మూవీ ని ... సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో రణబీర్ కపూర్ హీరోగా రూపొందుతున్న యనిమల్ మూవీ ని కూడా ఇదే తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ యూనిట్ లు ప్రకటించాయి. ఇలా భారీ క్రేజ్ ఉన్న ఈ సినిమాలతో పాటు చిరంజీవి సినిమా విడుదల చేస్తున్నట్టు ప్రకటించడంతో చిరంజీవి "భోళా శంకర్" మూవీ విడుదల తేదీ విషయంలో రిస్కు చేస్తున్నడు అని పలువురు అభిప్రాయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: