తెలుగులో స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, హీరో రామ్ పోతినేని కాంబినేషన్లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ చిత్రం ఎంతటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రామ్ కెరియర్ లోని ఈ సినిమా బిగ్గెస్ట్ హిట్టుగా నిలిచాడమే కాకుండా కలెక్షన్ల పరంగా కూడా భారీగానే రాబట్టింది. ఈ సినిమా తర్వాత పూరి మళ్లీ ఫామ్ లోకి వచ్చాడని అందరూ అనుకున్నారు.కానీ ఆ తర్వాత విజయ్ దేవరకొండ తో లైగర్ సినిమా తీయడంతో ఘోరమైన డిజాస్టర్ గా మిగిలింది.మళ్లీ పూరి ప్లాపులను సొంతం చేసుకున్నారు.


దీంతో పూరి జగన్నాథ్ ఈ సినిమా నుంచి కోలుకోలేని పరిస్థితి ఏర్పడింది. మరొకసారి ప్రేక్షకుల ముందుకు సరికొత్త సినిమాతో రావాలని ఎంతో ప్రయత్నిస్తున్నారు. తాజాగా ఒక స్పెషల్ స్టోరీ రాసుకున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అది కూడా ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్ అన్నట్లుగా తెలుస్తోంది పార్ట్ వన్ లాగా కూడా విచిత్రంలో రామ్ హీరోగా నటిస్తున్నారు అయితే ఈ సినిమా అక్టోబర్ నెలలో ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది. వీలైనంత త్వరగా ఈ సినిమా షూటింగ్ను పూర్తి చేసి వచ్చే ఏడాది జులై 18వ తేదీన విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇస్మార్ట్ శంకర్ మొదటి భాగం కూడా అదే రోజున విడుదలయ్యింది. అందుకే ఈ సినిమా షూటింగును కూడా పూర్తి చేసి అదే రోజున విడుదల చేయాలని చూస్తున్నారు చిత్ర బృందం.


మాస్ అభిమానులను ఆకట్టుకున్న ఇస్మార్ట్ శంకర్ సినిమా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది.అయితే హీరో రామ్, పూరి డైరెక్షన్ లో మరొకసారి హీట్ కాంబో రిపీట్ అవ్వడంతో అభిమానులు కూడా తెగ సంబరపడిపోతున్నారు. అయితే ఇందులో హీరోయిన్లు ఎవరనే విషయాన్ని మాత్రం ఇంకా సస్పెన్స్ గానే ఉంచారు ప్రస్తుతం రామ్ బోయపాటి శ్రీను దశరథంలో ఒక సినిమాను చేయబోతున్నారు  ఈ సినిమా ఏడాది దసరాకి విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: