పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న తాజా చిత్రం బ్రో.. ఈ చిత్రాన్ని సముద్రఖని దర్శకత్వం వహిస్తూ ఉన్నారు.ఇప్పటికే ఈ సినిమా పైన భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ అంచనాలను మరింత పెంచే విధంగా ఈ సినిమా ట్రైలర్ ఉండబోతుందని అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. తాజాగా బ్రో సినిమా ట్రైలర్ కూడా రిలీజ్ డేట్ లాక్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా ట్రైలర్ను మరో మూడు రోజులు అంటే ఈ నెల 21వ తేదీన విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు నిర్మాత అందరికంటే ముందుగా స్పందించినట్లు సమాచారం. ఈ విషయాన్ని టి జి విశ్వ ప్రసాద్ స్వయంగా తెలియజేశారు.

బ్రో సినిమా ఇప్పటివరకు పలు రకాల పాటలు,టీజర్ పోస్టర్లు సైతం విడుదలై ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాయి. మరొకవైపు సడన్గా ట్రైలర్ రిలీజ్ డేట్ ను తెలియజేసి అభిమానులకు సడన్ సర్ప్రైజ్ ఇచ్చారు. అయితే ఇలా చేయడానికి ఒక కారణం ఉందన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.. ఈ సినిమాకు సంబంధించి విడుదలైన పాటలు రెస్పాన్స్ సరిగ్గా రాలేకపోవడంతో చిత్ర బృందం ఆలోచించి  కాస్త తొందరగా ట్రైలర్ను రిలీజ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి సంగీత దర్శకుడు తమన్ సంగీతాన్ని అందించారు.


పవన్ కళ్యాణ్ ఇందులో ఒక దేవుడు పాత్రలో మరొకసారి కనిపించనున్నారు.. కేతిక శర్మ ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్లుగా నటిస్తూ ఉన్నారు. రీమేక్ ప్రాజెక్టుగా వస్తున్న ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే మాటలు అన్నీ కూడా త్రివిక్రమే అందించినట్లు తెలుస్తోంది. ఈ నెల 28వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. మరి ఏ మేరకు ప్రేక్షకులను ఈ సినిమా ఆకట్టుకుంటుందో చూడాలి మరి. ఒకవైపు పవన్ కళ్యాణ్ సినిమాలు చేస్తూనే రాజకీయాలలో కూడా చాలా చురుకుగా పాల్గొంటున్నారు. మరి రాజకీయాలలో ఈసారైనా గెలుస్తారేమో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: