ఈ మూవీ మాస్ యాక్షన్ థ్రిల్లర్ అని తెలిసిందే. ఈ సినిమాను నాగవంశీ సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో నిర్మించారు. ఈ సినిమాకు తెలుగులో విజయ్ కి యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ వాయిస్ ఇవ్వగా.. తమిళం లో సూర్య, హిందీలో రణబీర్ కపూర్ వాయిస్ ఇచ్చారు. ఇక ఈ సినిమాకు స్టార్ హీరోలు వాయిస్ ఇవ్వడంతో ప్రేక్షకులలో అంచనాలు మరింత పెరిగిన విషయం తెలిసిందే. ఇక ఇటీవలే ఈ మూవీ టీజర్ విడుదల అయ్యిందో.. లేదో రికార్డ్ స్థాయిలో వ్యూస్ వచ్చాయి. కొన్ని గంటల్లోనే యూట్యూబ్ లో ఈ మూవీ టీజర్ కు 10 మిలియన్స్ వ్యూస్ వచ్చాయి. ఈ మూవీలో యాక్షన్ సీన్స్ అలాగే డైలాగ్స్ ఉంటాయని మూవీ మేకర్స్ తెలిపారు. టీజర్ చూడగానే విజయ్ అభిమానులు బొమ్మ బ్లాక్ బస్టర్ అవుతుందని అంటున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి