తమిళ స్టార్ హీరోల్లో విజయ్ సేతుపతి ఒకరు. ఎటువంటి బ్యాక్‌గ్రౌండ్ లేనప్పటికీ తన ప్రతిభ, స్వయంకృషితో విజయ్ సేతుపతి భారీ స్టార్డమ్ సంపాదించుకున్నారు. కేవలం కోలీవుడ్‌కే పరిమితం కాకుండా ఇతర భాషల్లోనూ సినిమాలు చేస్తూ జాతీయస్థాయిలో గుర్తింపు సొంతం చేసుకున్నారు. అయితే ఇటీవల రమ్య మోహన్ అనే ఓ మహిళ విజ‌య్ సేతుపతిపై సంచల ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. కోలీవుడ్‌లో క్యాస్టింగ్ కౌచ్ బాగా ఉందంటూ ఆమె సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది.


`తమిళ సినీ పరిశ్రమలో డ్రగ్స్, క్యాస్టింగ్ కౌచ్ సంస్కృతి విస్తరిస్తోంది. నాకు తెలిసిన ఓ అమ్మాయి ఆ ఉచ్చులో పడి ప్రస్తుతం రిహాబ్ సెంటర్లో అడ్మిట్ అయింది. సోషల్ మీడియాలో సాధువుల కనిపించే విజయ్ సేతుపతి కారవాన్ ఫేవర్స్ కోసం రూ. 2 ల‌క్ష‌లు, డ్రైవ్స్ కోసం రూ. 50 వేలు ఆఫర్ చేశాడు. ఆమెని కొన్నేళ్లుగా వాడుకున్నాడు. వీళ్లను చాలామంది జనాలు సాధువులుగా భావించి పూజలు చేస్తుంటారు. డ్రగ్స్ ఇచ్చి సెక్స్ చేయ‌డం నిజం. ఇది జోక్ కాదు` అంటూ సదరు మహిళ పోస్ట్ పెట్టింది. ఈ పోస్ట్ తీవ్ర చ‌ర్చ‌కు దారితీసింది.


అయితే `సార్ మేడ‌మ్‌` ప్ర‌మోష‌న్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న విజయ్ సేతుప‌తి... తనపై వచ్చిన లైంగిక ఆరోపణలపై ఓపెన్ అయ్యారు. ``నన్ను ఎన్నో ఏళ్లుగా చూస్తున్న వారంతా ఆమె ఆరోపణలు చూసి నవ్వుకున్నారు. వాళ్లకే కాదు నేనేంటో నాకు కూడా తెలుసు. ఏడేళ్లుగా ఎన్నో ఒడిదుడుకుల‌ను చూశాను. దీనికీ భ‌య‌ప‌డ‌లేదు. ఈ రకమైన తప్పుడు ఆరోపణలు నన్ను బాధించలేవు. కానీ నా కుటుంబ సభ్యులు, సన్నిహితులు ఎంతో కలత చెందారు. ` వీటిని పట్టించుకోకండి. ఆమె ఫేమస్ కావడం కోసమే ఇలా చేస్తుంది. ఇండస్ట్రీలో ఇలాంటి రూమర్స్ సహజం. ఈ విధ‌ర‌మైన ఆరోప‌ణ‌ల‌తో ఆమె పేరు కొన్ని నిమిషాలు హైలెట్ అవుతుంది. మా ఎంజాయ్మెంట్ కోసమే ఇదంతా. పాపం ఎంజాయ్ చేయనివ్వండి అని వారితో చెప్పాను` అలాగే ఆమెపై త‌న టీమ్ సైబ‌ర్ క్రైమ్ కు ఫిర్యాదు కూడా చేసింది.` అని విజ‌య్ సేతుప‌తి క్లారిటీ ఇచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: