సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక పాజిటివిటీ ఎంత పెరిగిందో తెలియదు కానీ నెగటివిటీ మాత్రం విపరీతంగా పెరిగిపోయింది. అది ఏ రంగానికి సంబంధించినా సరే. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీలో సోషల్ మీడియా నెగిటివిటీకి కీలక వేదికగా మారింది అని చెప్పడంలో సందేహమే లేదు. దానికి పెద్ద ఉదాహరణ వార్ 2 సినిమా. ప్రస్తుతం సోషల్ మీడియాలో వార్ 2ను ఫ్లాప్ చేయాలని, నెగిటివ్ టాక్ తీసుకురావాలని ఒక స్పెషల్ టీమ్ రెడీ అయిపోయిందని వార్తలు బాగా ట్రెండ్ అవుతున్నాయి. తారక్ నెగిటివ్ షేడ్స్‌లో, హృతిక్ రోషన్ హీరోగా నటించిన ఈ లేటెస్ట్ బిగ్ సినిమా కోసం చాలా మంది ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎప్పుడెప్పుడు థియేటర్లో చూసేద్దామా అంటూ రెడీగా ఉన్నారు. అయితే ఈ సినిమాపై నెగిటివ్ టాక్ కూడా వినిపిస్తోంది.


దానికి ప్రధాన కారణం జూనియర్ ఎన్టీఆర్ వార్ 2 ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో మాట్లాడిన మాటలేనని చెబుతున్నారు. ఒక సీనియర్ హీరోని టార్గెట్ చేసే విధంగా ఆయన మాట్లాడారన్న ఆరోపణలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. అంతేకాక, జూనియర్ ఎన్టీఆర్ ఇండస్ట్రీలో హీరోగా ఉండకూడదని, బాలీవుడ్‌కు వెళ్లిపోయిన ఆయన అక్కడే ఉండిపోవాలనే కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి. అదే కాకుండా, ఈవెంట్‌లో ఫ్యాన్స్‌పై కొంచెం అసహనం వ్యక్తం చేస్తూ, "మీరు ఇలా అరిస్తే నేను వెళ్ళిపోతాను, మైక్ వదిలి వెళ్లడానికి ఒక్క సెకండ్ పట్టదు" అని కొంచెం కోపంగా మాట్లాడారు. దీన్ని కూడా నెగిటివ్‌గా మార్చి చర్చిస్తున్నారు.



అయితే, నందమూరి ఫ్యాన్స్ మాత్రం అలర్ట్ అయ్యారు. కేవలం జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే కాదు, గతంలో ఎంతో మంది స్టార్ హీరోలు కూడా స్టేజ్‌పై ఫ్యాన్స్‌పై కోప్పడ్డారని గుర్తు చేస్తున్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ లాంటి వారు ఫ్యాన్స్ చేతులు కలపడానికి, ఫోటోలు తీసుకోవడానికి వచ్చినప్పుడు చీదరించుకున్న సందర్భాలు ఉన్నాయని.  అప్పట్లో ఎవరూ ట్రోల్ చేయలేదని అంటున్నారు. కానీ ఇప్పుడు మాత్రం ఎన్టీఆర్‌ను కావాలనే టార్గెట్ చేస్తూ ట్రోలింగ్ చేస్తున్నారని. "అప్పుడు లేవని నోర్లు ఇప్పుడు లేస్తున్నాయే ఏం??" అంటూ ఘాటుగా కౌంటర్స్ వేస్తున్నారు. చూడాలి..ఇలాంటి  నెగటివ్ కామెంట్ల మధ్య వార్ 2 సినిమా రిలీజ్ అయ్యి ఎంత హిట్ టాక్ తెచ్చుకుంటుందో..?

మరింత సమాచారం తెలుసుకోండి: