ప్రముఖ నటి పూర్ణ తెలుగుతో పాటు తమిళ్, మలయాళం, కన్నడ ప్రేక్షకులకు కూడా సుపరిచితురాలే. 2004లో ఫిల్మ్ కెరీర్ ప్రారంభించిన పూర్ణ స్టార్ హీరోయిన్ గా ముద్ర వేయించుకోలేకపోయింది. కానీ గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తూ నటిగా తనకంటూ ప్రత్యేకమైన స్థానం సంపాదించుకుంది. పలు చిత్రాల్లో మెయిన్ లీడ్ గా, మరికొన్ని చిత్రాల్లో సహాయక నటిగా ప్రేక్షకులను అలరిస్తోంది. పెళ్లై ఒక బిడ్డ‌కు త‌ల్లైన కూడా పూర్ణకు అవకాశాలు మాత్రం ఆగడం లేదు.


అయితే ప్రొఫెష‌న‌ల్ లైఫ్ కార‌ణంగా పూర్ణ ప‌ర్స‌న‌ల్ లైఫ్ గ‌ట్టిగా ఎఫెక్ట్ అవుతోంది. తాజాగా పూర్ణ భ‌ర్త షానిద్ అసిఫ్ అలీ పెట్టిన పోస్ట్ తో ఈ విష‌యం బ‌య‌ట‌ప‌డింది. బ్యాక్ టు బ్యాక్ షూటింగ్స్ కార‌ణంగా దాదాపు 45 రోజుల పాటు పూర్ణ త‌న భ‌ర్త‌కు దూరంగా ఉంది. భార్య లేక‌పోవ‌డంతో ఒంటరిత‌నం భ‌రించ‌లేకపోయిన పూర్ణ భ‌ర్త షానిద్ సోష‌ల్ మీడియా వేదిక‌గా ఓ ఎమోష‌న‌ల్ పోస్ట్ పెట్టారు.


ఈ 45 రోజుల్లో ప్రేమ గొప్పదనం ఏంటో నాకు తెలిసొచ్చింది. మనల్ని ప్రేమించే వారు మనతో ఉండటమే నిజమైన వరమ‌ని నేను తెలుసుకున్నాను. ఎన్నో ఎదురుచూపుల తర్వాత ఈరోజు నా భార్య నా దగ్గరకు తిరిగొచ్చేసింది. ఆమెను చూసి ఆనందభాష్పాలు ఆపుకోలేకపోయాను` అంటూ షానిద్ పోస్ట్ పెట్టారు. అయితే కొంద‌రు నెటిజ‌న్లు ఈ పోస్ట్‌ను త‌ప్పుగా అర్థం చేసుకున్నారు. భ‌ర్త‌తో పూర్ణ‌కు మ‌న‌ర్స‌ర్థ‌లు వ‌చ్చాయ‌ని కొంద‌రు అభిప్రాయ‌ప‌డ్డారు. కానీ వారింద‌రికీ షానిద్ క్లారిటీ ఇచ్చాడు.


`నాకు, నా భార్య‌కు ఎటువంటి ఎడ‌బాటు రాలేదు. సినిమా షూటింగ్స్ నిమిత్తం పూర్ణ‌ 20 రోజులు చెన్నైలో, 15 రోజులు మలప్పురంలో, ఆ తర్వాత జైలర్ 2 మూవీ కోసం తన ఇంటిలో కొద్దిరోజులు ఉంది. మొత్తం 45 రోజులు మేమిద్ద‌రం దూరంగా ఉండాల్సి వచ్చింది. పెళ్లైన తర్వాత ఎన్నడూ ఇంతకాలం వేరుగా ఉండలేదు` అని షానిద్ స్ప‌ష్టం చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: