ఇంతలో తాజాగా ఈ సినిమా నుంచి ఒక పెద్ద సర్ప్రైజ్ అప్డేట్ బయటకు వచ్చింది. రాజమౌళి తన ట్విట్టర్ (ఎక్స్) ద్వారా ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు. ఆయన పోస్ట్లో ఇలా రాశారు –“సినిమాలోని మూడు ప్రధాన పాత్రలతో ప్రస్తుతం మా క్లైమాక్స్ షూట్ జరుగుతోంది. మరోవైపు గ్లోబల్ థియేట్రికల్ ఈవెంట్ కోసం ఏర్పాట్లు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. ఇంతకు ముందు ఎప్పుడూ చూడని విధంగా ఈ ఈవెంట్ ఉండబోతోంది.నవంబర్ 15న మీరు ఈ ఈవెంట్ను చాలా ఎంజాయ్ చేస్తారని నమ్ముతున్నాను. నేను కూడా ఆ రోజు కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నాను. అంతవరకు మీరు మరింత ఎగ్జైటెడ్గా ఉండేందుకు… ఈరోజు పృథ్వీరాజ్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేస్తున్నాం. సిద్ధంగా ఉండండి!”అని రాజమౌళి రాసుకొచ్చారు.
ఈ పోస్ట్ సోషల్ మీడియాలో రచ్చ రేపుతోంది. ఎందుకంటే రాజమౌళి తన గత సినిమాల విషయంలో ఇంతగా పర్సనల్గా అప్డేట్ ఇవ్వడం చాలా అరుదు. కానీ “SSMB 29” కోసం మాత్రం ఆయన స్వయంగా ఫ్యాన్స్తో ఇలా నేరుగా కనెక్ట్ అవడం అందరినీ ఆశ్చర్యపరిచింది.అంతేకాకుండా — “మీ ఆనందం కోసం పృథ్వీరాజ్ పోస్టర్ విడుదల చేస్తున్నాను” అని చెప్పడం ఫ్యాన్స్లో మరింత ఉత్సాహాన్ని రేపింది. ఇప్పటికే ఆ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు ఆనందంతో షేర్ చేస్తూ, కామెంట్స్తో ముంచెత్తుతున్నారు. కొంతమంది అయితే —“రాజమౌళిలో ఈ యాంగిల్ కూడా ఉందా..? అసలు ఊహించలేదు!”అని కామెంట్ చేస్తున్నారు. మొత్తం మీద, రాజమౌళి నుండి వచ్చిన ఈ అప్డేట్ ఫ్యాన్స్కు పండగ వాతావరణం తీసుకొచ్చింది. నవంబర్ 15 వరకు ఉత్కంఠతో ఎదురుచూడడమే ఇప్పుడు అందరి టార్గెట్..!
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి