సూపర్ స్టార్ మహేష్ బాబు, డైరెక్టర్ రాజమౌళి కాంబినేషన్లో వస్తున్న SSMB 29 సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రంలో హీరోయిన్గా ప్రియాంక చోప్రా నటిస్తోంది. అలాగే విలన్ పాత్రలో పృథ్విరాజ్ సుకుమారన్ నటిస్తున్నారు. ఇటీవల ఫస్ట్ లుక్ కుంభగా విడుదల చేయగా, అదిరిపోయే రెస్పాన్స్ లభించింది. అంగవైకల్యం ఉన్న వ్యక్తిగా కనిపించారు ఆయన లుక్ నెక్స్ట్ లెవెల్ లో ఉందని చెప్పవచ్చు.ఈ చిత్రాన్ని హాలీవుడ్ రేంజ్ లో తెరకెక్కించేలా రాజమౌళి ప్లాన్ చేశారు. ఇక నిర్మాతలు కూడా ఎక్కడ బడ్జెట్ విషయంలో కాంప్రమైజ్ కావడం లేదు. సుమారుగా రూ.1000 కోట్ల రూపాయలతో తెరకెక్కిస్తున్నట్లు వార్తలయితే వినిపిస్తున్నాయి.


నవంబర్ 15వ తేదీన మేకర్స్ SSMB 29 చిత్రానికి సంబంధించి హైదరాబాదులోని రామోజీ ఫిలిం సిటీలో ఒక భారీ ఈవెంట్ ని ప్లాన్ చేసి అప్డేట్ విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ అప్డేట్ కోసం ఇండియన్ సినీ ప్రేక్షకులు కూడా చాలా ఎక్సైటింగ్ గానే ఎదురు చూస్తున్నారు. అయితే ఇంతకంటే ముందుగానే ఒక భారీ అప్డేట్ ఇవ్వబోతున్నట్లు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో ప్రియాంక చోప్రాకి సంబంధించి నవంబర్ 11న అంటే రేపటి రోజున ఫస్ట్ లుక్ ని విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారట.



ముందు చెప్పినటువంటి అప్డేట్ లాగే ఈ అప్డేట్ కూడా అదే రోజు అనౌన్స్మెంట్ చేసి విడుదల చేయబోతున్నట్లు టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇలా చెప్పకుండానే వరుస సర్ ప్రైజ్ తో భారీ ప్లాన్ చేస్తున్నారు రాజమౌళి. దీంతో మహేష్ బాబు అభిమానులు కూడా ఫుల్ ఖుషి అవుతున్నారు. రాజమౌళి సినిమా అంటే ఎలాగైనా  ఆలస్యం అవుతుందనే విషయం అందరికీ తెలిసిందే ఈ అప్డేట్లతో అభిమానులు కూడా ఖుషీగా చేయబోతున్నారు. మరి ప్రియాంక చోప్రా కు సంబంధించి ఫస్ట్ లుక్ ఎలా ఉండబోతుందో అనే విషయం తెలియాల్సి ఉంది..

మరింత సమాచారం తెలుసుకోండి: