బాలీవుడ్ లెజెండర్ యాక్టర్ ధర్మేంద్ర చనిపోయినట్టు గత కొద్ది గంటల నుండి కొన్ని వార్తలు మీడియాలో వైరల్ అవుతున్న సంగతి మనకు తెలిసిందే. అయితే తాజాగా ధర్మేంద్ర కూతురు ఈషా డియోల్ తన తండ్రి చనిపోలేదని, తన తండ్రి ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉంది అని, తండ్రి చనిపోయినట్టు వచ్చిన వార్తలన్ని అవాస్తవమని కొట్టిపారేసింది. దీంతో అందరికీ ఒక క్లారిటీ వచ్చింది. ఇదిలా ఉంటే తాజాగా ధర్మేంద్ర అనారోగ్యం గురించి వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో ఒక షాకింగ్ విషయం వైరల్ అవుతుంది. అదేంటంటే ధర్మేంద్ర కి నలుగురు పిల్లలు ఉన్నా కూడా రెండో పెళ్లి చేసుకున్నారు.. మరి ఆయన రెండో పెళ్లి చేసుకోవడానికి కారణం ఏంటి అనేది చూస్తే.. ధర్మేంద్ర మొదట ప్రకాష్ కౌర్ ని పెళ్లి చేసుకున్నారు. వీరికి సన్నీ డియోల్, బాబీ డియోల్,విజేత,అజేత అనే నలుగురు పిల్లలు ఉన్నారు.కానీ నలుగురు పిల్లలు పుట్టిన తరువాత కూడా ధర్మేంద్ర తనతో కలిసి సినిమాల్లో నటించిన హేమమాలినిని ప్రేమించారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి