బాలీవుడ్లో స్టార్ హీరోగా పేరు సంపాదించిన హీరో ధర్మేంద్ర అనారోగ్య సమస్య కారణంగా మరణించారంటూ ఈరోజు ఉదయం నుంచి ఎక్కువగా వార్తలు వినిపించాయి. ఈ విషయం విన్న అభిమానులతో పాటు పలువురు సినీ సెలబ్రిటీలు కూడా ఆయన ఆత్మకు శాంతి చేకూరాలంటూ పలు రకాల పోస్టులు సోషల్ మీడియాలో షేర్ చేశారు. కానీ ధర్మేంద్ర మరణించారనే విషయం మాత్రం కుటుంబ సభ్యులు ధ్రువీకరించలేదు. తన తండ్రి ఆరోగ్యంగా ఉన్నారంటూ కూతురు ఈషా డియోల్ పోస్ట్ షేర్ చేయడంతో అందరూ ఆశ్చర్యపోయారు. అలాగే ఇప్పుడు తాజాగా ధర్మేంద్ర భార్య హేమా మాలిని కూడా సోషల్ మీడియా వేదికగా తన భర్త పై వస్తున్న వార్తలను ఖండించింది.


సోషల్ మీడియా వేదికగా ధర్మేంద్ర భార్య హేమా మాలిని స్పందిస్తూ.. తన భర్త పైన ఇప్పుడు జరుగుతున్న దుష్ప్రచారం ఏమాత్రం క్షమించరాని తప్పు.. బాధ్యత కలిగిన ఛానల్స్ బతికి ఉండి చికిత్సకు స్పందిస్తున్న ఒక వ్యక్తి చనిపోయాడు అంటూ ఎలా ప్రచారం చేయగలవు? అని ఆమె ప్రశ్నించింది. ఇది కచ్చితంగా ఆ గౌరపరచడమే , ఇర్రెరెస్పాన్సిబుల్గా వ్యవహరించడమే అంటూ ఫైర్ అయ్యింది. ధర్మేంద్ర ఆరోగ్యం ప్రస్తుతం స్థిరంగానే ఉన్నదని అభిమానులు నమ్మకంగా ఉండాలంటూ కోరింది. అంతేకాకుండా దయచేసి మా కుటుంబానికి కొంత గౌరవం ఇవ్వండి ,అలాగే కొంత ప్రైవసీ ఇవ్వండి అంటూ తెలియజేశారు.


బాలీవుడ్ లో ధర్మేంద్ర మరణించారంటూ పలు రకాల వార్తలు మీడియాలలో ఎక్కువగా వినిపించాయి. దీంతో దేశవ్యాప్తంగా ధర్మేంద్ర మరణించారనే విషయం వైరల్ గా మారింది. ఈ విషయాల పైన అటు కూతురు , ధర్మేంద్ర భార్య ఇద్దరు క్లారిటీ ఇవ్వడంతో అభిమానులు కాస్త ఊపిరిపించుకున్నారు. మరి ఈ విషయం పైన ఇకనైనా రూమర్స్ ఆగుతాయేమో చూడాలి మరి. హేమా మాలిని  ట్వీట్ తో తప్పుడు ప్రచారాలకు స్వస్తి చెప్పినట్టుగా కనిపిస్తోందని పలువురు నెట్టిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: