- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .

నందమూరి నట‌సింహం బాలకృష్ణ - బోయపాటి శ్రీను కాంబినేషన్ తెర‌కెక్కుతున్న అఖండ 2 తాండవం సినిమా మరో రెండు రోజులలో థియేటర్లలోకి రానుంది. బోయ‌పాటి శ్రీను - బాలకృష్ణ కాంబినేషన్ అంటేనే తెలుగు సినిమా ప్రేక్షకులతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలలో ఎలాంటి అంచనాలు .. ఆసక్తి ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన సింహ - లెజెండ్ - సినిమాలతో పాటు అఖండ సినిమా అదిరిపోయే బ్లాక్ బ‌స్టర్ హిట్ కొట్టింది. ఇప్పుడు వీరి కాంబినేషన్లో అఖండ లాంటి సూపర్ డూపర్ హిట్ సినిమా కు సీక్వెల్ గా వస్తున్న అఖండ 2 తాండవం పై కని విని ఎరుగ‌ని రేంజ్ లో అంచనాలు ఉన్నాయి. బాలయ్య కెరీర్ లోనే అత్యధిక బిజినెస్ జరిపిన సినిమాగా అఖండ 2 రికార్డులకు ఎక్కింది. ఈ సినిమాకు ఒకరోజు ముందుగానే ప్రీమియర్ షోలు కూడా వేస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలలో టికెట్ రేట్ల పెంపుపై ప్రత్యేక అనుమతులు తెచ్చుకుంటున్నారు.


ఈ క్రమంలోనే అఖండ 2 తాండవం మరో సీనియర్ హీరో అయిన మెగాస్టార్ చిరంజీవి సైరా నరసింహారెడ్డి సినిమా నెలకొల్పిన‌ తొలి రోజు 82 కోట్ల గ్రాస్ వసూళ్ల ను క్రాస్ చేస్తుందా ? అన్న చర్చలు టాలీవుడ్ ట్రేడ్ వర్గాలలో జరుగుతున్నాయి. బాలయ్య కెరీర్లు అత్యధికంగా తొలిరోజు వసూళ్లపరంగా వీర సింహారెడ్డి రికార్డులకు ఎక్కింది. అఖండ‌ తర్వాత రిలీజ్ అయిన ఈ సినిమాపై భారీ హైప్ ఉంది. ఈ క్రమంలోనే వీర సింహారెడ్డి తొలి రోజు ప్రపంచ వ్యాప్తంగా 54 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఇప్పుడు బాలయ్య సైరా నరసింహారెడ్డి తొలి రోజు నెలకొల్పున 82 కోట్ల వ‌సూళ్లు క్రాస్ చేస్తుందా ? అన్న చర్చలు నడుస్తున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: