ఈషా రెబ్బా మన తెలుగు అమ్మాయి. ఇప్పటికే టాలెంట్ ప్రూవ్ చేసుకుంది. ఆశించిన  విధంగా పెద్ద మూవీస్ ఏవీ చేతిలో పడడం లేదు కానీ సరైన చాన్సులు వస్తే విరగదీస్తానని అంటోంది. గ్లామర్ కి గ్రామర్ నేర్పే టాలెంట్ తన సొంతం అని చెబుతోంది. ఆమె లేటెస్ట్ మూవీ సుబ్రహ్మణ్యపురం. ఈ మూవీలో ఆమె అక్కినేని హీరో సుమంత్ పక్కన జోడీ కట్టింది. ఈ మూవీ టీజర్, ట్రైలర్లు బాగానే ఉన్నాయి. దీనిపైనే ఆశలు పెట్టుకున్న ఈషా రెబ్బా మరో వైపు తన గ్లామర్ ఫోజులను కూడా సోష‌ల్ మీడియాతో పోస్ట్ చేస్తూ యూత్ ని ఆకట్టుకుంటోంది.


అంతకు ముందు ఆ తరువాత మూవీ ద్వారా టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన ఈ భామకు 'అమీ తుమీ'.. 'అ!' లాంటి విజయవంతమైన చిత్రాలలో అవకాశం దక్కింది. ఈ మధ్యనే యంగ్ టైగర్ నందమూరి అరవింద సమేత సినిమాలో కూడా సెకండ్ హీరోయిన్ గా నటించి మార్కులు కొట్టేసింది. ఇప్పటికైతే చిన్న హీరోలు, మూవీస్ లోనే కనిపిస్తున్న ఈషా రెబ్బాకు స్టార్ హీరోల పక్కన అవకాశం వస్తే రెచ్చిపోతానంటోంది.


అందం, అభినయం కలిగిన ఈ తెలుగు భామను మన టాలీవుడ్ పట్టించుకోవడం లేదేమోననిపిస్తోంది. బాలీవుడ్ పైనే ఎంత సేపూ చూపు పెడుతున్న ఫిల్మ్ మేకర్స్ ఈషా లాంటి వారికి చాన్స్ ఇచ్చి చూస్తే బాగుంటుందేమో. మన అందాన్ని మనమే గుర్తించాలి కదా. ఈషా కూడా అదే నమ్మకంతో ఉన్నట్లుగా కనిపిస్తోంది.

మరి 'సుబ్రహ్మణ్యపురం' హిట్ అయితే ఈషా అవకాశాలు మరింతగా పెరగడం ఖాయం. ఇదిలా ఉండగా  తాజాగా తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా చేఇన  ఫోటో పోస్ట్ కు 16గంటల్లో 37వేలకు పైగా లైకులు వచ్చాయంటే ఈషా రెబ్బా అంటే అబ్బా అనిపించక మానదు.
 



మరింత సమాచారం తెలుసుకోండి: