తెలంగాణ జిల్లాలో క‌రోనా మ‌ళ్లీ విజృంభిస్తోంది. తాజాగా న‌మోదవుతున్న కేసులే ఇందుకు నిద‌ర్శ‌నంగా నిలుస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో 278 కేసులు న‌మోదు కాగా ఖమ్మం 91, కొమరం భీమ్‌ అసిఫాబాద్‌ 10, మహబూబ్‌ నగర్‌ 19, మహబూబాబాద్‌ 16, మంచిర్యాల్‌ 31, మెదక్‌ 17, మేడ్చల్ మల్కాజ్‌గిరి 133, ములుగు 27, నాగర్‌ కర్నూల్‌ 28,నారాయణ్‌పేట్‌ 4, నిర్మల్‌ 21, నిజామాబాద్‌ 25, పెద్దంపల్లి 28, రాజన్న సిరిసిల్ల 17, రంగారెడ్డి 112, సంగారెడ్డి 31, సిద్ధిపేట్‌ 42, సూర్యాపేట 48, ఆదిలాబాద్ 13, భద్రాద్రి కొత్తగూడెం 97, జగిత్యాల్‌ 27, జనగాం 14, జయశంకర్ భూపాలపల్లి 17, జోగులమ్మ గద్వాల్‌ 9, కామారెడ్డి 29, కరీంనగర్‌ 68,  నల్గొండ 70,  వికారాబాద్‌ 10, వనపర్తి 18, వరంగల్‌ రూరల్‌ 23, వరంగల్‌ అర్బన్‌ 39, యాద్రాది భువనగిరి 28 కేసులు నమోదు కావ‌డం గ‌మ‌నార్హం.  


రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 1,440గా ఉంది. రాష్ట్రంలో ఇప్ప‌టి వ‌ర‌కు న‌మోదైన మొత్తం కేసుల సంఖ్య 2,50,331 కు చేరుకుంది. 24 గంటల్లో ఐదు మంది కరోనా బారిన పడి మరణించగా.. మృతుల సంఖ్య 1,377కు చేరింది. ఇక కరోనా నుంచి తాజాగా 1,481 మంది డిశ్చార్జ్‌ కాగా.. కోలుకున్న వారి సంఖ్య 2,29,064 కు చేరింది. ప్రస్తుతం తెలంగాణలో 19,890 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో 42,673 పరీక్షలు నిర్వహించగా, మొత్తం టెస్ట్‌ల సంఖ్య 46,18,470 కు చేరింది.



ఇదిలా ఉండ‌గా దేశ వ్యాప్తంగా క‌రోనా విజృంభ‌న కొన‌సాగుతోంది. దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 45,674 కోవిడ్‌ పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వైరస్‌ బాధితుల్లో మరో 559 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 1,26,121 కు చేరింది. తాజా కేసులతో భారత్‌లో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 85,07,754 కి చేరగా... 5,12,665 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. శనివారం ఒక్కరోజే 49,082 మంది కోవిడ్‌ నుంచి కోలుకోవడంతో.. కోలుకున్నవారి మొత్తం సంఖ్య 78,68,968 కు చేరింది. ఈమేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదివారం హెల్త్‌ బులెటిన్‌లో పేర్కొంది. చ‌లి పెరుగుతున్న నేప‌థ్యంలో క‌రోనా వ్యాప్తి కూడా మ‌రింత ఎక్కువ‌గా ఉండే అవకాశాలున్న‌ట్లుగా ఆరోగ్య నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: