వెనుకటికి కాంగ్రెస్ పార్టీలో ఇలాంటి రాజకీయాలు ఎన్నో చూశాం.. ఇప్పుడు కొత్తగా చంద్రబాబుకు భయపడేది ఏమిటి? అన్నట్టుగా ఉంది తెలుగుదేశం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి స్పందన. జేసీ సోదరుల తీరుపై తెలుగుదేశం అధినేత చంద్రబాబు గుర్రుగా ఉన్నాడని.. వీళ్లిద్దరినీ పిలిపించుకొని బాబు త్వరలోనే క్లాసు పీకడం ఖాయమని వార్తలు వస్తున్న తరుణంలో దివాకర్ రెడ్డి ఘాటుగానే స్పందించాడు.
బాబు పిలిస్తే తాను వెళ్లడానికి సిద్ధమని పెద్ద జేసీ ప్రకటించాడు. బాబు పిలుపు కోసమే తను వేచి ఉన్నట్టుగా ఆయన స్పందించాడు. ఇటీవలి కాలంలో దివాకర్ రెడ్డి పార్టీకి నష్టం కలిగించే చర్యలు ఎన్నో చేస్తున్నాడు. అలాంటి మాటలెన్నో చెబుతున్నాడు. ప్రత్యేక హోదా గురించి పోరాటమా.. వంకాయా అనడం దగ్గర నుంచి.. తెలుగుదేశం అధినేత స్ట్రాటజీకి వ్యతిరేకమైన మాటలెన్నో మాట్లాడాడు దివాకర్ రెడ్డి. ఈ విషయంలో ప్రభాకర్ రెడ్డి ఏమీ తక్కువ కాదు!

'అన్నా క్యాంటీన్ల' ఆలోచన 

Image result for babu canteens

ప్రత్యేకించి వీరు 'చంద్రన్న కానుక' వంటి కార్యక్రమాలపై కూడా ధ్వజమెత్తారు. అదొక అర్థంలేని పథకం అన్నారు. 'అన్నా క్యాంటీన్ల' ఆలోచన కూడా వృథా అని స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీ వాళ్లు వేటినైతే గొప్ప పథకాలుగా చెప్పుకొన్నారో.. వాటి విషయంలోనే జేసీ సోదరులు తమ నోటికి పని చెప్పారు. ఇలాంటి నేపథ్యంలో వీరు తాజాగా అనంతపురం, కడప జిల్లాల రైతుల నీటి గొడవ మధ్య తలదూర్చినందుకు బాబు ఆగ్రహంతో ఉన్నాడని వార్తలు వచ్చాయి.. మొత్తం వ్యవహారాలపై బాబు జేసీని తలంటే అవకాశాలున్నాయని అన్నారు. దీనికి జేసీ కూడా రెడీ అంటున్నాడు. బాబు దగ్గరకు వెళ్లడానికి సిద్ధమని ప్రకటన చేశాడు. మరి బాబు నుంచి పిలుపు ఎప్పుడొస్తుందో!



మరింత సమాచారం తెలుసుకోండి: