ఇప్పుడు ఏ విషయం అయినా సరే సోషల్ మీడియా ద్వారా ప్రజల్లోకి ఒక్క సెకల్ పంపించగల టెక్నాలజీ పెరిగిపోయింది. సెలబ్రెటీలు తమ అభిప్రాయాలు, ఆనందాలు,శుభాకాంక్షలు ప్రజలకు ఫేస్ బుక్, ట్విట్టర్,వాట్సప్ ల ద్వారా అందిస్తూ తమ అభిమానులతో మమేకమౌతున్నారు. 69 వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని వివిధ రంగాలకు చెందిన ప్రముఖలు సెల్యూట్ సెల్ఫీ ద్వారా వారి దేశభక్తిని చాుకుంటున్నారు. స్వాతంత్ర్యద్యోమం, దేశ రక్షణలో అమరులైన వారికి సామాజిక మాద్యమాల్లో సెల్యూట్ సెల్ఫీతో వారికి నివాళులర్పించారు. అబితాబ్, షారూక్,రిషి కపూర్,షాహిద్ కపూర్,సోనూసూద్,సోనాక్షి,ప్రియాంకా చోప్రా లు తమ అభిమానులు సెల్యూట్ చేస్తూ ఫోటోలు షేర్ చేశారు. ఇక టాలీవుడ్ లో అక్కినేని నాగచైతన్య,అఖిల్,నాని సెల్పీలు పంపించారు. క్రీడారంగానికి చెందిన వారు వీరేంద్ర సెహ్వాగ్,పారుపల్లి కశ్యప్,సైనా నెహ్వాల్,సానియా మిర్జా తదితరులు సెల్యూట్ సెల్పీతో వారి దేశభక్తిని చాటుకున్నారు. ఇక పాలిటిక్స్, పారిశ్రామిక వేత్తలు కూడా తమ సెల్ఫీలతో దేశభక్తి చాటుకున్నారు.


దేశభక్తి చాటుకున్న సెలబ్రెటీలు :

మరింత సమాచారం తెలుసుకోండి: