క్యాన్సర్ ప్రతీ ఏటా ఎందరో ప్రాణాలను తీస్తుంది. క్యాన్సర్ విషయంలో ఎంత అలెర్ట్ గా ఉన్నా సరే ప్రజలు ఇబ్బంది పడుతూనే ఉన్నారు. వారసత్వ ప్రకారం కూడా ఈ వ్యాధి ఇబ్బందులకు గురి చేస్తుంది. దీనిపై ఎందరో ప్రముఖులు అవగాహన కల్పిస్తున్నారు. అయినా సరే క్యాన్సర్ పై ప్రజలు అవగాహన లేక ఎందరో ప్రాణాలు కోల్పోతున్నారు. ఎమ్ ఎన్ జె క్యాన్సర్ హాస్పటల్ లో బ్రెస్ట్ క్యాన్సర్ పై అవగాహనా కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత... క్యాన్సర్ పై కీలక వ్యాఖ్యలు చేసారు.

బ్రెస్ట్ క్యాన్సర్ మహమ్మారిని నిర్మూలించే బాధ్యత సమాజంలో మనందరిపై ఉందన్నారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. హైదరాబాద్ లోని  ఎమ్ ఎన్ జె క్యాన్సర్ హాస్పటల్ లో బ్రెస్ట్ క్యాన్సర్ పై అవగాహనా కార్యక్రమంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొని ఈ సందర్భంగా ‘బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్ నెస్ వాక్’ ను ఊపి ప్రారంభించారు. గతంలో 60 ఏండ్ల పైబడిన వాళ్లకు వచ్చే క్యాన్సర్ ఇప్పుడు 30 సంవత్సరాలకే వస్తున్నదని, కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కుటుంబ సభ్యుల మీద కూడా ఉంది అని కవిత మాట్లాడుతూ అన్నారు.

ఆడపిల్లలకు తప్పకుండా ఏడాదికి ఒకసారి క్యాన్సర్ పరీక్షలు చేయించడంతో పాటు, జీవితంలో ఆరోగ్యకరమైన అలవాట్లు చేసుకోవాలని ఎమ్మెల్సీ కవిత ప్రజలకు సూచించారు. తల్లి, చెల్లి, భార్య ఆరోగ్యంపై కుటుంబ సభ్యులు ప్రత్యేక శ్రద్ద తీసుకోవాల్సి ఉంది అని ఎమ్మెల్సీ కవిత  అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రి అయిన ఎమ్ ఎన్ జే క్యాన్సర్ హాస్పటల్ లో బ్రెస్ట్ క్యాన్సర్ పై అవగాహనా కార్యక్రమం నిర్వహించిన ఆసుపత్రి ఇంచార్జీ జయలలితకు ఎమ్మెల్సీ కవిత అభినందనలు తెలిపి భవిష్యత్తులో మరిన్ని మంచి కార్యక్రమాలు చేయాలని విజ్ఞప్తి చేసారు. దేశ వ్యాప్తంగా ఇటువంటి కార్యక్రమాలు జరగాలని ప్రజలు క్యాన్సర్ బారి నుంచి బయటపడాలి అని ఆమె కోరారు.

మరింత సమాచారం తెలుసుకోండి: