హైదరాబాద్ లో ఈ మధ్య కాలంలో కొన్ని కేసులు కాస్త సంచలనం అవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో తాజాగా పంజాగుట్టలో జరిగిన ఒక చిన్నారి రేప్ ఘటన వివాదాస్పదంగా మారింది. దీనికి సంబంధించి హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ మీడియాతో మాట్లాడారు. సైకో కిల్లర్ ను హాబీబ్ నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు అని ఆయన పేర్కొన్నారు. ఈ సైకో కిల్లర్ పై గతంలో నాలుగు కేసులు ఉన్నాయి అని ఆయన పేర్కొన్నారు. హాబీబ్ నగర్ లో ఇద్దరు బెగ్గర్స్ ను చంపేశాడు అన్నారు.

గత నెల 15 తేదీన హాబీ నగర్  నాంపల్లి పీఎస్ లో ఒకరిని హత్య చేశాడు అని ఆయన తెలిపారు. ఈ రెండు హత్య లు కేవలం నాలుగు గంటల వ్యవధిలో జరిగాయి అన్నారు. కర్ణాటక బీదర్ కు చెందిన ఖదీర్ అనే వ్యక్తి హత్య చేసినట్లు గుర్తించి అరెస్ట్ చేశాము  అని ఆయన తెలిపారు. నిందితుడు ఖదీర్ కు మానసిక స్థితి సరిగ్గా లేదు దీంతో మద్యం మత్తులో హత్యలు చేస్తున్నాడు  అని తెలిపారు. గతంలో ఒక బెగ్గర్ ను హత్య చేసి 16 నెలలు జైల్ కి వెళ్ళేసి వచ్చాడు  అని ఆయన పేర్కొన్నారు. జైల్ నుండి బయటకి వచ్చాక కూడా హాబీబ్ నగర్, నాంపల్లి లో మరో ఇద్దరిని చంపాడు  అన్నారు.

హైదరాబాద్ జాయింట్ సీపీ ఏఆర్ శ్రీనివాస్ మాట్లాడుతూ పంజా గుట్ట చిన్నారి అనుమానాస్పద మృతి కేసు పై విచారణ కొనసాగుతోంది  అని అన్నారు. చిన్నారి ఎవరు అనేది విచారణ కొనసాగుతుంది  అని తెలిపారు. 100 సిసి కెమెరాలు పరిశీలించాము  అని ఆయన వ్యాఖ్యానించారు. చిన్నారి ఫోటోలు అన్ని పోలీస్ స్టేషన్లు కు పంపించి , పరిశీలిస్తున్నాం  అని అన్నారు. చిన్నారి ఒంటిపై పాత గాయాలు ఉన్నాయి, కొత్తగా గాయాలు లేవు  అని ఆయన పేర్కొన్నారు. ఎక్కడో హత్య చేసి పంజాగుట్టలో పడేసి ఉంటారని భావిస్తున్నాం అన్నారు ఆయన. అన్ని పోలీస్ స్టేషన్ లో చిన్నారుల మిస్సింగ్ కేసులు పై కూడా ఆరా తీస్తున్నాం  అని తెలిపారు. చిన్నారి పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తే మరి కొన్ని విషయాలు బయట పడతాయి అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ts