ఆఫ్ఘన్ ఆక్రమణ తరువాత పరిస్థితి అంతా తమకు అనుకూలంగా ఉంటుంది అని చైనా, పాక్ ఆశించడం జరిగింది. కానీ వాళ్ళు పెట్టుకుంది ఉగ్రభూతాలతో అని, కాస్త జాగర్తగా ఉండాలని అప్పట్లో తోచినట్టుగా లేదు. అందుకే ఇప్పుడు వాళ్ళు చేయి దాటిపోయారు. పాక్, చైనా కు సహకరించకుండా, వీలైతే పాక్ ను కూడా ఆదీనంలోకి తెచ్చుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. పాక్ లో ప్రభుత్వం మారితే మటుకు దాదాపుగా ఆక్రమణ జరిగిపోయినట్టుగా భావించవచ్చు. ఇమ్రాన్ దానికి అడ్డుపడుతున్నాడు కాబట్టి అతడిని తప్పించి, తమకు అనుకూలమైన వాడిని అధినేతగా ఏర్పాటు చేసుకోవాలన్నది తెహ్రికి తాలిబన్ వ్యూహం.
ప్రస్తుతం ఇస్లామిక్ దేశాల సంస్థ(ఓఐసి)లో చేరాలని తాలిబన్ లు పాక్ ను కోరుతున్నారు. అంటే ఇక దాదాపుగా తాలిబన్ చేతిలోకి పాక్ వెళ్లినట్టుగానే భావించవచ్చు. ఈ నెల 19న దానికి సంబంధించి సమావేశాలు నిర్వహిస్తుంది తాలిబన్ ప్రభుత్వం. పాక్ సహా ఇతర ఇస్లామిక్ దేశాలు ఈ ఆహ్వానాన్ని మన్నిస్తాయా, తాలిబన్ సంస్థలో చేరతాయా అనేది ఆ సమావేశం అనంతరం తెలియనుంది. ఇప్పటికే పాక్ సహా ఇతర ఇస్లామిక్ దేశాలకు, అమెరికా, రష్యా, బ్రిటన్, యూరోపియన్ యూనియన్, ప్రపంచ బ్యాంకులకు తాలిబన్ ప్రభుత్వం సమావేశాలకు హాజరు కావాలని ఆహ్వానం పంపింది. పాక్ కూడా ఆయా దేశాలు ఈ సమావేశానికి హాజరు కావాలని కోరుతుంది. ఇది భవిష్యత్తులో పాక్ కు పెను ముప్పు తెస్తుంది. ఇప్పటికే ప్రపంచ దేశాలు వెలేసిన స్థితిలో పాక్ ఉంది, ఇప్పటికి ఇలాంటి పనులు చేస్తూ ఉంటె దాని భవిష్యత్తు ఇంకా సమస్యలలో పడుతుంది. అయితే తాలిబన్ దురాక్రమణలను ఇస్లాం దేశాలు కూడా ఆహ్వానించబోవని చెప్పిన విషయం తెలిసిందే. ఈ ప్రస్తుత ఆహ్వానం పై కూడా ఇంకా ఏ దేశం కూడా స్పందించలేదు.