రాజ్యసభలో ఎంపీ విజయ సాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు. గతంలోనే హోదాకు బదులుగా ప్యాకేజీకి రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించిన విషయాన్ని గుర్తు చేశారు. ప్యాకేజీ కింద ఏపీ ప్రభుత్వం నిధులు తీసుకుందని మంత్రి పంకజ్ చౌదరి వెల్లడించారు. అదే సమయంలో విభజన సమయంలో ఇచ్చిన హామీల అమలు విషయంలో కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరం లేదని కూడా కేంద్ర మంత్రి పంకజ్ చౌదరి క్లారిటీ ఇచ్చేశారు. దీంతో ఏపీ ప్రజలకు హోదాపై ఉన్న అపోహలు పూర్తిగా తొలగిపోయినట్లు అయ్యింది. రాష్ట్రానికి పదేళ్ల పాటు ప్రత్యేక హోదా ఇస్తామని 2014లో నాటి ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ పార్లమెంట్లో ప్రకటించారు. కానీ ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం... ఆ హామీని పక్కన పెట్టేసింది. దీనిపై గత ముఖ్యమంత్రి చంద్రబాబు, పలువురు సామాజిక వేత్తలు రాజకీయ నేతలు ఎన్ని సార్లు కేంద్రం వద్ద ప్రస్తావించినా కూడా ప్రయోజనం లేకుండా పోయింది. చివరికి కేంద్రంతో టీడీపీ తెగదెంపులు కూడా చేసుకుంది. చివరికి ఇది ముగిసిన అధ్యాయంటూ కొత్త వాదన కూడా మొదలు పెట్టేసింది కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ.
రాజ్యసభలో ఎంపీ విజయ సాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు. గతంలోనే హోదాకు బదులుగా ప్యాకేజీకి రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించిన విషయాన్ని గుర్తు చేశారు. ప్యాకేజీ కింద ఏపీ ప్రభుత్వం నిధులు తీసుకుందని మంత్రి పంకజ్ చౌదరి వెల్లడించారు. అదే సమయంలో విభజన సమయంలో ఇచ్చిన హామీల అమలు విషయంలో కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరం లేదని కూడా కేంద్ర మంత్రి పంకజ్ చౌదరి క్లారిటీ ఇచ్చేశారు. దీంతో ఏపీ ప్రజలకు హోదాపై ఉన్న అపోహలు పూర్తిగా తొలగిపోయినట్లు అయ్యింది. రాష్ట్రానికి పదేళ్ల పాటు ప్రత్యేక హోదా ఇస్తామని 2014లో నాటి ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ పార్లమెంట్లో ప్రకటించారు. కానీ ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం... ఆ హామీని పక్కన పెట్టేసింది. దీనిపై గత ముఖ్యమంత్రి చంద్రబాబు, పలువురు సామాజిక వేత్తలు రాజకీయ నేతలు ఎన్ని సార్లు కేంద్రం వద్ద ప్రస్తావించినా కూడా ప్రయోజనం లేకుండా పోయింది. చివరికి కేంద్రంతో టీడీపీ తెగదెంపులు కూడా చేసుకుంది. చివరికి ఇది ముగిసిన అధ్యాయంటూ కొత్త వాదన కూడా మొదలు పెట్టేసింది కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ.